అనుమతులు లేకుండా నడిపిస్తున్న జూనియర్ కళాశాలలను మూసివేయాలి
డి ఐ ఈ ఓ గోపాల్ కి వినతిపత్రం అందజేత
స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు
ఎల్తూరి సాయికుమార్
హన్మకొండ, నేటిధాత్రి:
సాయికుమార్ మాట్లాడుతూ హనుమకొండ నగరంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా విచ్చలవిడిగా జూనియర్ కళాశాలను నడిపిస్తున్న చైర్మన్ ల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరియు అదేవిధంగా విద్యార్థులను మరియు విద్యార్థుల తల్లిదండ్రులను ఇటు ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తూ విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తూ ,కనీస మౌలిక సదుపాయాలు లేకుండా కాలేజ్ స్ట్రక్చర్ లేకుండా నడిపించడమే కాకుండా జేఈఈ,మెయిన్స్ పేరిట లక్షల రూపాయలు విద్యార్థుల నుండి ముక్కు పిండి వసూలు చేస్తున్న కళాశాలల చైర్మన్లు, పర్మిషన్ ఉన్న బ్రాంచ్ వద్ద అడ్మిషన్ చేర్చుకొని అక్కడ క్లాసులు చెప్పకుండా విచ్చలవిడిగా అద్దె భవనాలు తీసుకొని అక్కడ కళాశాలలను నడిపించడం జరుగుతుంది ప్రమాదవశాత్తు అక్కడ ఏదైనా జరగరానిది జరిగితే విద్యార్థులకు బాధ్యత ఎవరు అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. స్థానిక డిస్టిక్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డి ఐ ఈ ఓ స్పందించి తక్షణమే అనుమతులు లేని కాలేజీలను మూసివేయాలని స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెట్టుపల్లి శివకుమార్, సిద్ధార్థ , విక్రం, సాత్విక్ ,శ్రావణ్, జస్వంత్ ,సాయి ,ముఖేష్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.