జనగాని కిరణ్ పార్థివా దేహానికి నివాళులు అర్పించిన వ్యవసాయ మార్కెట్ చైర్మన్

గణపురం నేటి ధాత్రి గణపురం మండలంలోని అప్పయ్యపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మోరాంచ వాగు వద్ద విద్యుత్ మరమ్మత్తులు చేస్తూ ప్రమాదవశత్తు స్థంభం పై నుండి పడి మరణించిన అన్ మ్యాండ్ ఎంప్లాయ్ జనగాని కిరణ్ గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,తన ప్రగాడ సానుభూతి తెలిపి,10,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించిన భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు
వారి వెంట కొండాపూర్ ఎంపీటీసీ మంద అశోక్ రెడ్డి, మండల అధ్యక్షులు మోతె కరుణాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు ఐలోని రాంచంద్రారెడ్డి, వడ్లకొండ నారాయణ గౌడ్,యూత్ నాయకులు గాజర్ల చింటూ గౌడ్, హఫీజ్ మరియు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!