సoగ్రామానికి వేళాయే..
పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్లు షురూ
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలో మూడో విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొద లైంది జిల్లాలో లోకల్ బాడీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది ఇటీవల ఎన్నికల తేదీలు ప్రకటించడం వల్ల మండలం, గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. మొదలైన స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పార్టీ బలాబలాలు, వారి ఊహాలు రచించడంలో ముందున్నారు. మూడో విడుదల ఎన్నికల్లో భాగంగా మండలంలో 24 గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థుల కోసం రేపు బుధవారం రోజున నామి నేషన్లు స్వీకరిస్తారు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో నామినేషన్ల స్వీకరణకు కేంద్రాలు ఏర్పాటు చేశారు
లోకల్ ఫైట్ షూరూ
శాయంపేట మండలంలో పంచాయతీ ఎన్నికల సందడి భాగంగా నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. గ్రామ సర్పంచ్ ఎన్నికలు మరింత రసవత్తంగా మారాయి అభ్యర్థులు ఓట ర్లను ఆకర్షించేoదుకు ముం దుకు రావడం ఎప్పుడు చర్చనీయంగా అంశంగా మారాయి. పార్టీ లందరూ ప్రజలందరిని ఆకర్షించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అభ్యర్థుల కేటాయింపు ప్రజల ఆధారంగా ఇవ్వాలని ప్రముఖ పార్టీలు ఆలోచన చేస్తున్నాయి కాబట్టి లోకల్ ఫైట్ రసవత్తంగా సాగుతుంది ప్రజలు ఆలో చనలో పడ్డారు.
ఉద్యోగులు ప్రచారం జోలి కెళ్లొద్దు
గ్రామపంచాయతీ ఎన్నికల వేల ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాల్సిందే. విద్య, వైద్య ఆరోగ్యశాఖ, ఐకెపి, ఆరోగ్యశ్రీ, అంగన్వాడీ కార్యకర్తలు పి ఆర్టీలు రిసోర్స్ పర్సనల్ పనిచేసే వారందరికీ ఎన్నికల నియమావళి వర్తిస్తుంది వీరు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలనేది ఎన్నికల కమిషన్ నిబంధన వీరి ఓటు హక్కును సాధారణ ఓటరుగా మాదిరిగా వినియోగించుకోవచ్చు. కానీ సాధారణ ప్రజానీకం మాదిరిగా ఏ పార్టీకి అనుకూలంగా ప్రచా రం చేయకూడదు. కానీ నచ్చి న పార్టీకి వ్యక్తి వెంట ప్రచారం లో సభలు సమావేశాలు విం దులు, వినోదాల్లో పాల్గొంటే వేటుపడుతుంది.
