సింగరేణి ఉద్యోగులకు ఎరియర్స్ చెక్కుల అందజేత

మందమర్రి, నేటిధాత్రి:-

మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 11వ వేజ్ బోర్డులో అత్యధిక ఏరియర్స్ అమౌంట్ పొందిన ఏరియా ఉద్యోగులు మోహన్ రెడ్డి, కేకే -5 ఎలక్ట్రిసియన్, గోపతి రామ్ చందర్ కెకె5 కోల్ కట్టర్ జోగుల కొమరయ్య, కే.కే5 హెడ్ ఓవర్ మెన్, మొదలగు వారికి ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్ గురువారం చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఏరియా జిఎం మాట్లాడుతూ, ఏరియర్స్ పొందిన ఉద్యోగులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. పొందిన సొమ్ముని దుర్వినియోగం చేయకుండా ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సందేశించారు. అదేవిధంగా సీఎంపిఎఫ్, పెన్షన్, ఇన్కమ్ టాక్స్, మొదలగు మినహాయింపులు చట్టబద్ధమైనవని, ఈ మినహాయింపులు ప్రతినెల ఉద్యోగి జీతంలో కూడా ఉండే మినహాయింపులుగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం రాజేశ్వర్ రెడ్డి, టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్, ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, సిఎంఓఏఐ అధ్యక్షులు పడిశ్వర్, సంక్షేమాధికారి శ్రీనివాసరావు, ఇతర అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!