మందమర్రి, నేటిధాత్రి:-
మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 11వ వేజ్ బోర్డులో అత్యధిక ఏరియర్స్ అమౌంట్ పొందిన ఏరియా ఉద్యోగులు మోహన్ రెడ్డి, కేకే -5 ఎలక్ట్రిసియన్, గోపతి రామ్ చందర్ కెకె5 కోల్ కట్టర్ జోగుల కొమరయ్య, కే.కే5 హెడ్ ఓవర్ మెన్, మొదలగు వారికి ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్ గురువారం చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఏరియా జిఎం మాట్లాడుతూ, ఏరియర్స్ పొందిన ఉద్యోగులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. పొందిన సొమ్ముని దుర్వినియోగం చేయకుండా ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సందేశించారు. అదేవిధంగా సీఎంపిఎఫ్, పెన్షన్, ఇన్కమ్ టాక్స్, మొదలగు మినహాయింపులు చట్టబద్ధమైనవని, ఈ మినహాయింపులు ప్రతినెల ఉద్యోగి జీతంలో కూడా ఉండే మినహాయింపులుగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం రాజేశ్వర్ రెడ్డి, టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్, ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, సిఎంఓఏఐ అధ్యక్షులు పడిశ్వర్, సంక్షేమాధికారి శ్రీనివాసరావు, ఇతర అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.