*గిరిజనులకు తెలవకుండానే జిసిసి సర్వసభ్య సమావేశం.*
*ఐదు మండలాల గిరిజనులకు సర్వసభ్య సమావేశానికి హక్కు లేదా.*
*సమస్యల పరిష్కారానికి వేదిక సర్వసభ్య సమావేశనికి*
*గిరిజనులు దూరం ఎందుకు.*
*మహాదేపూర్ జిసిసి లో ఏం జరుగుతుంది. గుట్టు చప్పుడు కాకుండా తీర్మానాలు ఎందుకు.?*
*నేటి ధాత్రి ,డిఎం ను వివరణ కొడితే పొంతనలేని సమాధానాలు. పిఓ దృష్టికి తీసుకువెళ్లిన “నేటి ధాత్రి.*
*మహదేవపూర్ -నేటి ధాత్రి:*
గిరిజన సహకార సంస్థ జిసిసి మహదేవ్పూర్ లో ఏం జరుగుతుంది. గిరిజనుల అభివృద్ధి కొరకు ఏర్పాటు చేసిన జిసిసి, గిరిజనులను అణగదొక్కే ప్రయత్నం చేస్తుందా, గిరిజనుల హక్కులను కాలరాసే కుట్ర జిసిసి నుండి అధికారులు చేస్తున్నారా, అనే విషయానికొస్తే వాస్తవమే అని ప్రత్యక్షంగా కనబడుతుంది. గురువారం రోజు జిసిసి సర్వసభ్య సమావేశం గుట్టుచప్పుడు కాకుండా చేయడం, గిరిజనులను అనగా దోక్కడమే లక్ష్యంగా అని చెప్పడంలో సందేహం లేదు. సర్వసభ్య సమావేశాల పేరుతో గిరిజనులకు తెలవకుండా జిసిసి అధికారులు గుడుపుటానిలు చేస్తున్నారనేది చెప్పడానికిబ్ గురువారం జరిగిన సర్వసభ్య సమావేశమే సాక్ష్యం.
గిరిజనులకు తెలవకుండానే జిసిసి సర్వసభ్య సమావేశం
5 మండలాలకు సంబంధించిన మహాదేవపూర్ గిరిజన సహకార సంస్థ, గిరిజనుల అభివృద్ధి అటవీ ఉత్పత్తుల కొనుగోలు ధర నిర్ణయం గిరిజనుల సమస్యలను పరిష్కరించుకొనుటకు గిరిజనుల సమక్షంలో, సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ అధికారులు అలా కాకుండా ,ఐదు మండలాలకు సంబంధించిన గిరిజనులకు ఎలాంటి సమాచారం లేకుండా గురువారం రోజు గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించుకోవడం అనేక అనుమానాలకు దారితీస్తుంది. గిరిజనుల సమక్షంలో చేపట్టాల్సిన తీర్మానాలు కేవలం అధికారులు డైరెక్టర్ల సమక్షంలో నిర్ణయించుకోవడం వెనుక కారణాలు ఏమిటో తెలియ రావడం లేదు.
మహాదేపూర్ జిసిసి లో ఏం జరుగుతుంది. గుట్టు చప్పుడు కాకుండా తీర్మానాలు ఎందుకు.?
దీనికి సంబంధించి ప్రస్తుతం మహాదేవపూర్ మండల కేంద్రంలో జిసిసి గుట్టుచప్పుడు కాకుండా సర్వసభ్య సమావేశం నిర్వహించుకోవడంపై, జీసీసీలో గుడుపుటాని జరుగుతుందన్న వాదనలు ప్రజల్లో బలంగా వినబడుతున్నాయి, జిసిసి సర్వసభ్య సమావేశం నిర్వహణపై నీటి ధాత్రి డిఎం వివరణ కోరగా, నేను ఆహ్వానం మేరకు వచ్చానని స్థానిక మేనేజర్కు వివరాలు కోరాలని, కొత్త డైరెక్టర్లకు సన్మానం చేయడం జరిగిందని, గుంతల లేని సమాధానం చెబుతూ ఫోన్ కట్ చేయడం జరిగింది. జిసిసి లో గుర్తుచేప్పుడు కాకుండా నిర్వహించిన సర్వసభ్య సమావేశం బియ్యం పొంతన లేని సమాధానాల వ్యవహారం నీటి ధాత్రి పిఓ దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది, గిరిజనుల సమక్షంలో నిర్వహించాల్సిన సమావేశాన్ని జిసిసి అధికారులు గిరిజనులు లేకుండా ఇలా నిర్వహించడం జరిగిందో విచారణ జరిపి ఇలాంటి చర్యలు తీసుకుంటారు వేచి చూడాల్సిందే.