గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో జడ్.పి.హెచ్.ఎస్ హై స్కూల్లో నిర్వహించబడుతున్న సమ్మర్ కోచింగ్ క్యాంప్ నీ ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి చిర్ర రఘు.
ఈ కార్యక్రమంలో క్యాంపు కోచ్ మామిడిశెట్టి రవీందర్ సీనియర్ క్రీడాకారులు అశోక్,వెంకన్న ,సారంగపాణి, శ్రీనివాస్, కుమార్ విద్యార్థులు పాల్గొన్నారు. చిర్రా రఘు మాట్లాడుతూ
క్యాంప్ నిర్వాహకులకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున తగు జాగ్రత్తలు పాటించాలని
జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సూచించారు. సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ ఆటగాడు విడదని అశోక్ ఐదు బ్యాట్లు వేముల పెళ్లి సాంబయ్య ఒక డజన్ బాల్స్ ఆటగాళ్లకు క్రీడా సామాగ్రి అందజేశారు