పాఠశాల ప్రాంగణంలో..
ప్రమదకరంగా సంపు
పట్టించుకోని అధికారులు, ప్రతినిధులు
నిజాంపేట: నేటి ధాత్రి
ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఓ సంపు ప్రమదకరంగా తయారైంది. నిజాంపేట మండలం నస్కల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మన ఊరు మనబడి పథకం కింద పాఠశాల అభివృద్ధి కోసం పనులు చేపట్టి మధ్యలోనే నిలిపివేశారు. ఆ పనుల్లో భాగంగా పాఠశాల ఆవరణలో తీసిన సంపు ప్రమాదకరంగా తయారైంది. సంపుపై ఎలాంటి రక్షణ లేకపోవడంతో ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. కాంట్రాక్టర్కు పలుమార్లు చెప్పిన ఏమి ఫలితం లేదు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి రక్షణ ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు.
