ఎమ్మెస్ స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలి.
సిపిఐ నేతలు రమేష్ వెంకటయ్య
వనపర్తి నేటిధాత్రి
పశ్చిమ ఆసియా యుద్ధం జరుగడం వల్ల చమురు ధరలు పెరగడం తో రైతులకు నష్ట పోతున్నారని
రైతుల సమితి రాష్ట్ర అధ్యక్షులు జక్కుల వెంకటయ్య, సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ అన్నారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ
బిజెపి కేంద్ర ప్రభుత్వం 14 పంటల ధరలను పెంచడం జరిగిందని
ఆహార పంటలు పప్పు దినుసులు, నూనె గింజలు వాణిజ్య పంటల ధరలను అరకొరగా ధరలు పెంచి మేము రైతులను రైతుల ఆదాయం పెంచినామని చెప్పు కుంటున్నారని వారు అన్నారు ఎమ్మెస్ స్వామినాథన్ సిఫారసులు అమలు జరిగే వరకు ఉద్యమిం చాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో గోపాల్ లక్ష్మీనారాయణ నర్సింహ తదితరులు పాల్గొన్నారని రమేష్ తెలిపారు
