అనారోగ్యంతో మృతి చెందిన మాజీ కోఆప్షన్ సభ్యురాలి భర్త
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతనపల్లి మునిసిపాలిటీ మాజీ కోఆప్షన్ సభ్యురాలు రజియా భర్త ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో శనివారం మృతి చెందారు. బిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ కోఆప్షన్ సభ్యురాలు రజియా భర్త మరణం పార్టీకి తీరని లోటని బిఆర్ఎస్ పార్టీ చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాజా రమేష్ బాబు అన్నారు. కుటుంబాన్ని పరామర్శించి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. రజియా కుటుంబానికి మనోధైర్యాన్ని అందించారు. కుటుంబానికి ఎల్లవేళలా పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు రామిడి కుమార్, మాజీ కౌన్సిలర్ పోగుల మల్లయ్య, గడ్డం సంపత్, నాయకులు జక్కన బోయిన కుమార్, గడ్డం రాజు, చంద్రమౌళి, సదానందం, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.