నడికూడ,నేటిధాత్రి:
మందకృష్ణ మాదిగ
పిలుపుమేరకు
ఓరుగల్లు గడ్డమీద జులై 7న, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావ 30వ వసంతాల సంబరాలను పురస్కరించుకొని మాదిగ మహాజన కవాతుకు సిద్ధం చేయడంలో భాగంగా నడికూడ మండల కన్వీనర్
సంగాల సుమన్ మాదిగ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి నడికూడ మండల ఇన్చార్జి ఏకు శంకర్ మాదిగ విచ్చేసి నడికూడ గ్రామంలో నూతన ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ నిర్మాణం చేయడం జరిగింది.
అనంతరం ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షుడు దుప్పటి శ్రీకాంత్ మాదిగ మాట్లాడుతూ నాయొక్క ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన ఎమ్మార్పీఎస్ నాయకులకు,సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని గ్రామ స్థాయిలో బోలోపేతం చేయడంతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పక్షాన 30 సంవత్సరాలుగా ఉద్యమాలు నడిపిస్తూ మాదిగ జాతి గౌరవాన్ని దేశం గర్వించేలా చేస్తున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ కి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే వచ్చేనెల జులై 7న జరగబోయే మాదిగల ఆత్మగౌరవ కవాతును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఎమ్మార్పీఎస్ నడికూడ నూతన గ్రామ కమిటీ.
అధ్యక్షుడిగా దుప్పటి శ్రీకాంత్ మాదిగ
అధికార ప్రతినిధిగా కొమ్ము అఖిల్ మాదిగ
ఉపాధ్యక్షులుగా దుప్పటి కృపాకర్,దుప్పటి భాస్కర్ మాదిగ
ప్రధాన కార్యదర్శిగా దుప్పటి సుమన్ మాదిగ,
కార్యదర్శిగా దుప్పటి రాజు మాదిగ,
ప్రచార కార్యదర్శిగా దుప్పటి రమేష్ మాదిగ,
కోశాధికారిగా నేరెళ్ల అరుణ్ కుమార్ మాదిగ,
గౌరవ సలహాదారుగా దుప్పటి సుమన్ మాదిగ,
కార్యవర్గ సభ్యులుగా
దుప్పటి విజేందర్ మాదిగ
దుప్పటి ప్రియరంజన్
దుప్పటి సదానందం మాదిగ
సంగాల విజేందర్ మాదిగ
దుప్పటి అనిల్ మాదిగ
సంగాల సురేష్ మాదిగ
దుప్పటి రాజయ్య మాదిగ
ఇనుగాల పవన్ మాదిగ
దుప్పటి రాజు మాదిగ
దుప్పటి ప్రణయ్ మాదిగలను
ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.