Health Center
ఆరోగ్య కేంద్రం పనులు మధ్యలోనే ఆగిపోయాయి: గ్రామస్థుల ఆవేదన
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని కవేలి గ్రామంలో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య సబ్ సెంటర్ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. గోడలు, పైకప్పు పూర్తయినా, లోపలి పనులు అసంపూర్తిగా ఉండటంతో భవనం నిరుపయోగంగా మారింది. దీంతో గ్రామ ప్రజలు ఆరోగ్య సదుపాయాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. పనులను త్వరగా పూర్తి చేసి సబ్ సెంటర్ ను ప్రారంభించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
