గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం పరశురాం పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రవి నగర్ కాలనీకి చెందిన చేతి పంపు పనిచేయకపోవడంతో కాలనీవాసులు రానున్న ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని నీటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఎంపీడీవో ఎల్ భాస్కర్ ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ కార్యదర్శి శరత్ చంద్ర ,చేతిపంపు రిపేర్ మెకానిక్ గడ్డం బిక్షపతి, చేతి పంపును మరమ్మత్తు చేయడం జరిగింది. చేతిపంపు రిపేర్ కావడంతో ఆ కాలనీవాసులు నీటి ఇబ్బంది లేకుండా చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు.