అర్హులైన ప్రతి పేద వారికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తాం,!!
వివిధ ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు
చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్!!!
జగిత్యాల నేటి ధాత్రి
జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలోని స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో శుక్రవారం రోజున ప్రభుత్వ విప్,ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్
1,39,20,000 విలువ గల 120 కళ్యాణ లక్ష్మి చెక్కులను మరియు దివ్యాంగులకు సంబంధించిన 50 వేల చొప్పున 81 చెక్కులను, లక్ష రూపాయల చొప్పున 5 చెక్కులను అర్హులైన లబ్ధదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటిలలో రెండు హామీలను అమలు చేయడం జరిగిందని,మరో రెండు హామీలను త్వరలోనే అమలుచేయడం జరుగుతుందని,కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పేదల సంక్షేమం గురించి, ఆలోచించడం జరుగుతుందని,అర్హులైన ప్రతి పేదవారికి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబందించిన పలాలు అందించేలా చూస్తామని,పేద ప్రజల సంక్షేమం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ రాజీపడే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు