బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న కొర్కిశాల మాజీ సర్పంచ్ దానవేణి రాములు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని వనం కావ్య రాకేషదంపతుల కుమార్తె జ్ఞానిక పుట్టినరోజు వేడుకలు రేగొండ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొడవటంచలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కొర్కిశాల మాజీ సర్పంచ్ దానవేణి రాములు చిన్నారి పాపను ఆశీర్వదించారు. ఆమె ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని, దేశంలో ప్రాముఖ్యత స్థానంలో నిలిచి..పుట్టిన ఊరికి..కన్న తల్లిదండ్రులకు..చదువు నేర్పిన గురువులకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొండా దంపతుల వీరాభిమాని పిల్లల శ్రీనివాస్ గౌడ్, చెక్క శ్రీధర్, పొలం పెళ్లి శంకర్ వనం వేణు జంగే శీనన్న శంకర్ నీరట్ రాజు వనం తిరుపతి అనిల్ కార్తీక్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు