ఘనపురం స్టేషన్ లో నిరసనల వెల్లువ , పలుచోట్ల పాల్గొన్న ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య

ఘనపురం మండల కేంద్రంలో రైతు వ్యతిరేక చట్టాలు కలిగించిన కేంద్ర ప్రభుత్వం బీజేపీ పై నిరసన శవ యాత్రలు చేపట్టడం జరిగింది ర్యాలీగా శవాన్ని ఊరేగింపు చేశారు ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఈ రోజున ఘనపూర్ స్టేషన్ నియోజక వర్గంలో అన్ని గ్రామాలలో ఈ నిరసనలు చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డివిరిచే ప్రయత్నం చేస్తుందని ప్రతిదీ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తూ రైతాంగాన్ని రైతులు పండిస్తున్న పంటలను ధాన్యాన్ని కొనకుండా ఇబ్బంది పాలు చేస్తుందని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం యొక్క ఒంటెద్దు పొకడ వల్ల అలాగే రైతుల వ్యతిరేక చట్టాల వల్ల రైతులు అయోమయ పరిస్థితి లో పడ వేస్తున్నారని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు నిర్ణయాలు మార్చుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇలానే నిరసనలు చేపడతామని వారు హెచ్చరించారు.
ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతాంగం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనుల వల్ల రిజర్వాయర్లు కాలువల ద్వారా వస్తున్నా సాగునీటితో రైతులు పంటలు పండించి సంతోషంగా ఉంటున్నారు ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను తప్పుదోవ పట్టిస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నామని అన్నారు

ఘనపూర్ స్టేషన్ మండలం కొత్తపల్లి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం కోసం చావు డప్పుతో శవయాత్ర ద్వారా గ్రామంలో ఊరేగింపు కార్యక్రమం లో పాల్గొన్నా తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, కొత్తపల్లి గ్రామ సర్పంచ్ గోవిందు ఆనందం,
స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారుపాక రవి, కూడా డైరెక్టర్ ఆకుల కుమార్ గన్ పూర్ మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు, సింగపూర్ ఎంపీపీ కందుల రేఖ-గట్టయ్య, ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు

ఘనపూర్ స్టేషన్ మండల కేంద్రంలోని తానేదార్ పల్లి గ్రామంలో బుధవారం రోజున గ్రామ శాఖ అధ్యక్షుడు కాంసాని రాజు రెడ్డి, ముఖ్యఅతిథి మార్కెట్ వైస్ చైర్మన్ చల్ల చందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చట్టాలపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను డబ్బులతో గ్రామమంతా ఊరేగింపు చేసి గ్రామ చౌరస్తా సెంటర్ లో దిష్టిబొమ్మను తగలబెట్టి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ యూత్ అధ్యక్షుడు గుండె రంజిత్, మండల్ ఎస్సీ సెల్ ఉఫాద్యాక్షడు గాదె పురుషోత్తం, గ్రామ శాఖ బీసీ సెల్ కార్యదర్శి రాచర్ల శీను, మండల నాయకులు చల్ల అనిల్ రెడ్డి, ఉరుమొడ్ల పద్మా రెడ్డి, కొలిపాక కొంరయ్య, కొలిపాక చంద్రు, గ్రామ శాఖ మహిళా విభాగం అధ్యక్షురాలు మాచర్ల విమల, మండల మహిళా ఉపాధ్యక్షురాలు మాచర్ల నీల, గ్రామ శాఖ మహిళా కార్యదర్శి బాస్కుల వెంకటమ్మ, చింత జయ, చుక్క కౌసల్య, డప్పు కళాకారులు బాస్కుల చిన్న ఎల్లయ్య, బాస్కుల ఉప్పలయ్య, బాస్కుల ఏలియా, చింత ప్రభాకర్, బొమ్మగళ్ళ చంద్రయ్య, మంద అశోక్ అశోక్, గుండె క్రిష్టయ్య, గాదె ముత్తయ్య, పెండ్లి ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

జనగామ జిల్లా జఫర్గడ్ మండల కేంద్రంలో తమ్మడ పల్లి గ్రామంలో మోడీ దిష్టిబొమ్మను చావు డప్పులతో ఊరేగింపుగా చేసి బిజేపి ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు హాజరయ్యారు, ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు చిలువేరు శివయ్య
గ్రామశాఖ అధ్యక్షుడు మారపల్లి కుమార్, మండల పార్టీ ఉపాధ్యక్షుడు రాపర్తి
రాజ్ కుమార్, గ్రామ రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ గద్ద కొమురయ్య, పిఏసిఎస్ డైరెక్టర్ లోకిని భిక్షపమ్మసాయిలు, మండల పార్టీ రైతు విభాగం మాజీ అధ్యక్షుడు పులిగిళ్ళ కుమార్,
వేల్పుల కొమురమ్మ,మహమ్మద్ బషీర్, వేల్పుల సతీష్, మహమ్మద్ రియాజ్, రైతులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *