స్నేహితుల ఔదార్యం

20వేల ఆర్థిక సహాయం
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మొగుళ్లపల్లి,ఏప్రిల్ 06 :జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామానికి చెందిన కామారపు శ్రీనివాస్ తల్లి జయమ్మ ఇటీవల మృతి చెందింది. కష్టాల్లో ఉన్న స్నేహితుడిని ఆదుకోవాలనే సంకల్పంతో 2000-2001వ సంవత్సరం 10వ తరగతి బ్యాచ్ కు చెందిన విద్యార్థులు రూ.20 వేల రూపాయలను జమ చేసి సోమవారం వారం రోజున స్నేహితుడైన కామారపు శ్రీనివాస్ కు ఆర్థిక సహాయాన్ని అందజేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆర్థిక సహాయం చేసిన వారిలో 2000-2001 బ్యాచ్ కు చెందిన తోటి స్నేహితులు గాజుల ప్రతాప్ గౌడ్, మచ్చ శ్రీధర్, గాజుల కుమారస్వామి, అనుముల ధనలక్ష్మి, పిన్నింటి రజిత, జ్యోతిరాణి, దేశిని శ్రీలత, వసంతలు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!