
Sircilla
గీతా జ్ఞాన యజ్ఞం సిరిసిల్ల గీతా ప్రచార సేవా సమితి కరపత్రం ఆవిష్కరణ
సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని గీత ఆశ్రమం లో గీత ప్రచార సేవా సమితి అధ్యక్షులు కోడం నారాయణ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనపాల శంకరయ్య కార్యనిర్వహణలో గీతా జ్ఞాన యజ్ఞం కరపత్రం ఆవిష్కరణ జరిగినది. ఆవిష్కరణకు ఆశ్రమ భక్తులు గీతా ప్రచార సేవా సమితి భక్తులు హాజరైనారు. భగవద్గీతలో రెండవ అధ్యాయం సాంఖ్యయోగం సాయంత్రం ప్రతిరోజు 6:30 నుండి 8 వరకు ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు భజన కార్యక్రమం 8 గంటల నుండి 9 వరకు శివ మహిమ స్తోత్రం ఉపనిషత్తు ప్రవచనాలు స్వామీజీ అక్షయ చైతన్య చెబుతారు సిరిసిల్ల వాసులు పరిసర ప్రాంత గ్రామ ప్రజలు ఈ ఆధ్యాత్మిక ప్రవచనాలు ప్రవచనాలను విని తరించాలని భగవద్గీత గొప్పదనాన్ని తెలుసుకొని సర్వేజనా సుఖినోభవంతు అనే నానుడిగా ముందుకు సాగాలని, ఇంత మంచి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మీ జీవితాన్ని ధన్యం చేసుకుంటారని ఆశిస్తున్నాము అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కొక్కుల రాజేశం, గజ్జల్లి రామచంద్రం, వేముల బక్కయ్య, జక్కని రమేష్, మెరుగు మల్లేశం మెరుగు లక్ష్మణ్ రుద్ర రాజేంద్రప్రసాద్, జి సత్యనారాయణ ,లకావత్ మోతిలాల్, మోర దామోదర్, గడ్డం కౌసల్య బూర్ల శారద సారంగం, మొదలైన వారు పాల్గొన్నారు