gananga hanuman irumudi mahostvam, ఘనంగా హనుమాన్‌ ఇరుముడి మహోత్సవం

ఘనంగా హనుమాన్‌ ఇరుముడి మహోత్సవం

మండల రోజులు దీక్ష పూర్తి చేసుకున్న హనుమాన్‌ మాలాదారులు సోమవారం ఇరుముడి మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. నర్సంపేట డివిజన్‌లోని దుగ్గొండి మండలం చంద్రయ్యపల్లి గ్రామంలోని హనుమాన్‌ భక్తులు మాలాధారణతో మండల దీక్ష పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని హనుమాన్‌ దేవాలయంలో గణపతి హోమం, నవగ్రహాల పూజలను వేదపండితులు గణేశ్‌శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుండి నిర్వహించుకున్నారు. అనంతరం ఇరుముడి మహోత్సవాన్ని పూర్తి చేసుకున్నారు. గ్రామంలోని మహిళలు, కుటుంబసభ్యులతో కలిసి ఇరుముడి ప్రాంగణం వద్ద భక్తిశ్రద్ధలతో పూజలను నిర్వహించారు. బుధవారం జరిగే హనుమాన్‌ జయంతి సందర్భంగా ద్విచక్రవాహనాలపై భద్రాచలానికి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో కందుల కుమారస్వామి, కామెడీ మల్లారెడ్డి, ఈర్ల కొమ్మాలు, గడ్డమీది కుమారస్వామి, శరత్‌, రుదీర్‌, రామకష్ణ, శ్రీనివాస్‌లతోపాటు పలువురు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *