ఉచిత మెగా వైద్య శిబిరం
నిజాంపేట, నేటి ధాత్రి
నిజాంపేట మండల పరిధిలోని బచ్చరాజ్ పల్లి గ్రామంలో గురువారం మల్లారెడ్డి హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రముఖ సంఘ సేవకుడు గట్టు ప్రశాంత్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది.ఈ ఉచిత వైద్య శిబిరంలో బీపీ,షుగర్, థైరాయిడ్, మొదలగు వైద్య పరీక్షలు నిర్వహించి గ్రామంలోని సుమారు 200 మందికి ఉచిత టాబ్లెట్లు అందించారు. అవసరమైన వారికి 60 మందికి పైగా చెవి ముక్కు,గొంతు,థైరాయిడ్, గర్భసంచి, శరీర సంబంధ వ్యాధులకు గాను ఉచితంగా ఆపరేషన్ చేయించడానికి వీలుగా మల్లారెడ్డి హాస్పిటల్ వారి ఉచిత బస్సు ప్రయాణం ఉచిత ఆపరేషన్ సౌకర్యం కల్పిస్తుందన్నారు. అవకాశాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.క్రమంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటుకు గట్టు ప్రశాంత్,ను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రాములు, మల్లారెడ్డి హాస్పిటల్ బృందం డాక్టర్ అఖిలేష్,భవ్య,స్టాఫ్ నర్స్ లు అరుణ,ప్రవణి,ఫార్మా అంకిత,మార్కెటింగ్ మేనేజర్ ఎండి.మహమ్మద్,నాగప్ప, గ్రామస్తులు అంజయ్య,నక్క రవి,బోడపట్ల శ్రీనివాస్, హంసమ్మ,పాల్గొన్నారు.