స్వామి పూజలో మాజి ఎంపీ రావుల..

Former MP Ravula Chandra Shekhar

వనపర్తి లో శ్రీ సీతరామలక్ష్మణ సహిత శ్రీ వీరాంజనేయ స్వామి పూజలో మాజి ఎంపీ రావుల
వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి పట్టణంలో పాతబజార్ 3 వ వార్డులో శ్రీ వీరంజనేయ దేవాలయం ప్రతిష్ట సందర్భంగా పూజలో మాజి ఎంపీ రావుల చంద్ర శేఖర్ రెడ్డి పాల్గొన్నారు
ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు స్వామిని దర్శించుకుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా రావుల మాట్లాడుతూ ఆలయ పున నిర్మాణం అద్భుతంగా జరిగిందని ఇందుకు కృషి చేసిన ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు.రోడ్ల విస్తరణలో తర్వాత నూతనంగా రూపుదిద్దుకున్న ఆలయాలు,దర్గాలు,మసీదులు అద్భుతంగా ఉన్నాయని వీటికి కృషి చేసిన మాజి మంత్రి నిరంజన్ రెడ్డిని రావుల అభినందించారు
ఆలయం నిర్మించడంతో పాటు రోజు ధూపదీప నైవేద్యాలతో నిత్యం స్వామి వారిని పూజించాలని ఇందుక నా సహకారం ఉంటుందని రావుల హామీ ఇచ్చారు. కమిటీ సభ్యులు సాదరంగా రావుల చంద్రశేఖరరెడ్డి ని ఆహ్వానించి ఘనంగా సన్మానించారు.
అనంతరం నూతన బొడ్రాయి శిలాకు పూజలు నిర్వహించారు.
రావు ల వెంట జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్,గంధం.పరంజ్యోతి,బండారు.కృష్ణ,డాక్టర్. దానియాల్,సూర్యవంశపు
గిరి,సునీల్ వాల్మీకి,ఇమ్రాన్,మునికుమార్ ఆలయ కమిటీ సభ్యులు గోనూరు.వెంకటయ్య గుప్త ,వసంత శ్రీనివాసులు, నీల స్వామి,బాలస్వామి తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!