హసన్ పర్తి / నేటి ధాత్రి
వర్ధన్నపేట నియోజక వర్గం హసన్ పర్తి మండలం అర్వపల్లి గ్రామానికి చెందిన అంబాల రాజయ్య ఇటివల అనారోగ్యంతో మృతి చెందగా ఈ విషయం తెలుసుకుని వర్ధన్నపేట నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సహాయం చేశారు. వీరి వెంట బిజెపి పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ధర్మారావు, మల్లారెడ్డిపల్లి పిఎసిఎస్ చైర్మన్ జక్కు రమేష్ గౌడ్, 66 వ డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, కాజీపేట దర్గా చైర్మన్ ఊకంటి వనం రెడ్డి, తాళ్లపల్లి కుమారస్వామి, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.