శాయంపేట మండల రైతులు సద్వినియోగం చేసుకోవాలి
మండల వ్యవసాయ అధికారి గంగాజమునా
శాయంపేట నేటిధాత్రి:
2025వ సంవత్సరం వానా కాలానికి సంబంధించి రైతు భరోసా కోసం కొత్తగా పట్టా దారు పాసుపుస్తకాలు తీసు కున్నటువంటి రైతులు మీయొక్క పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు మరి యు మీ యొక్క బ్యాంక్ పాస్ పుస్తకం యొక్క జిరాక్స్ వెంటనే తీసుకొని మండల వ్యవసాయ విస్తరణ అధికారికి సమర్పించగలరు, దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ 18.06.2025 .జూన్ 18 వ తారీకు వరకే చివరి రోజు ఉన్నందున, రైతులు చివరి రోజు వరకు చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవా ల్సిందిగా కోరుతున్నాం ప్రస్తు తానికి ఈ పథకానికి జూన్ 5వ తారీఖు వరకు పట్టాదారు పాసుపుస్తకాలు పొందినటు వంటి రైతులు అర్హులు, ఒకవేళ ఇదివరకే రైతు భరోసా తీసు కుంటూ బ్యాంక్ అకౌంట్ ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకునే రైతులు కూడా వారి యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలతో మీ యొక్క వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలి.