రైతులకు భూసార పరీక్షలపై అవగాహన

*అన్నదాతల అవగాహన కార్యక్రమం*

*ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకోవాలి*

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రం లోని ఆరేపల్లి, వసంతాపూర్ గ్రామాల్లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో 99 రోజుల భాగంగా రైతు ముంగుట్లోకి శాస్త్రవేత్తలు సాగుచేసే పద్ధ తులపై,, ఎఫ్ పిఓ ల ప్రాము ఖ్యత అవగాహన కల్పిం చారు. రానున్న వానకాలం సాగుకై మెరుగైన సాగు పద్ధ తులపై అవగాహన కల్పిం చేందుకు ఆరేపల్లి గ్రామంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రొఫెసర్ డా.టి.శ్రీజయ మాట్లాడుతూ యూరియా వాడకాన్ని తగ్గిం చమని చెబుతూ పంట వ్యర్థా లను కాల్చకుండా భూమిలో కలియదున్నాలని వివరిం చారు పొలంలో గుంతలు చేసి పంటవ్యర్థాలను గుంతలో వేసి ఎరువు తయారు చేసు కొని దాన్ని పొలంలో జల్లుకో వాలని చెప్పారు.

 

నేలల్లోనీ సారం పెంచుకోవడానికి సేంద్రియ ఎరువులు పచ్చిరొట్ట ఎరువులు వాడకం ద్వారా చేయవచ్చని అవగాహన కల్పించారు. రైతాంగాన్ని ప్రధాన పంట వరి సాగు తగ్గించి ఆరుతడి పంటలతో పంట మార్పిడి చేయవలసిం దిగా కోరారు ప్రతీ రైతు కచ్చి తంగా భూసార పరీక్షలు చే యించుకొని దానికి అను గుణంగా ఎరువులు వేసుకో వాలని సూచించారు. అనం తరం వ్యవసాయ కళాశాల ఉద్యాన శాస్త్ర సహా ఉపాధ్యా యులు డా. ఎస్. వంశీ కృష్ణ పలు ఉద్యాన పంటల సాగు విధానం మరియు ఆయిల్ పామ్ పంట ప్రాముఖ్యతను మరియు సస్యరక్షణ పద్ధ తులు గురించి వివరించారు. తరువాత గ్రామ సర్పంచ్ రమ మాట్లాడుతూ ఈ కార్యక్రమా న్ని మా గ్రామంలో నిర్వహించి నందుకు అధికారులకు కృత జ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ప్రియదర్శిని, వ్యవసాయ విస్తరణ అధికారి జోష్ణ, ప్రజ్వ ల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఎన్జీవో రాంబాబు, వ్యవసా య కళాశాల విద్యార్థులు దేవేందు, శివాజీ , వసంత పూర్ సర్పంచ్ భాస్కర్, రైతులు, ఆరేపల్లి గ్రామ రైతులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version