*ఈ రోడ్డుకు మోక్షం ఎప్పుడో!*
*రోడ్డు నిర్మాణం కోసం ప్రజలు ఎదురుచూపులు*
శాయంపేట నేటిధాత్రి;
శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామం నుండి పరకాల కలిపే రహదారి నిర్మాణానికి మాత్రం మోక్షం లభించడం లేదు గత ఏండ్లు గా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టా లని స్థానిక ప్రజాప్రతినిధులకు కోరిన ఈ రహదారి మాత్రం మోక్షం కలుగడం లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం శిలాఫలకం వేసి రోడ్డుకు కంకర పోసి విడిచిపెట్టడం ద్వారా గ్రామ రైతులు పంట పొలాలకు వెళ్లే సమయంలో రోడ్డు గుంతలు గుంతలుగా మారి కంకర తేలి అటువైపు వాహనాలు వెళ్లా లంటే ప్రజలు భయ పడుతు న్నారు రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం ద్వారా వాహన దారులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు వాగు పై బ్రిడ్జి నిర్మాణం చేస్తే పరకాల దారి ప్రజలకు దూరభారం తగ్గు తుంది కాబట్టి గ్రామంలో ప్రజలు ఇప్పుడు ప్రభుత్వం ఈ రహదారిపై దృష్టిపెట్టి రోడ్డు నిర్మాణం జరిగేలా చూడాలని స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు.
