ఆయిల్ ఫామ్ విత్తన సాగు…

ఆయిల్ ఫామ్ విత్తన సాగు
ప్రారంభించిన జిల్లా వ్యవసాయ అధికారులు..

నిజాంపేట, నేటిధాత్రి:

 

ఆయిల్ ఫామ్ రిసోర్సెస్, ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ విత్తన సాగు నర్సరీ ని ప్రారంభించడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో ఆయిల్ ఫామ్ విత్తన సాగును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్, జిల్లా ఉద్యానవన అధికారి ప్రతాప్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలో రైతులు ఆయిల్ ఫామ్ పంటపై ఆసక్తి చూపడం ఆనందకరంగ ఉందన్నారు. రైతులు వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్ సాగు చేయడం ద్వారా అధిక ఆదాయన్నీ పొందవచ్చని సూచించారు. తక్కువ నీటి వినియోగంతో అధిక లాభాలను ఈ పంట ఇస్తుందన్నారు. జిల్లాలో పంట విస్తరణకు కావాల్సిన నాణ్యమైన మొక్కలను స్థానిక స్థాయిలో పెంచడమే ఈ నర్సరీ లక్ష్యమని పేర్కొన్నారు.జిల్లా ఉద్యాన అధికారి మాట్లాడుతూ.. చల్మెడ గ్రామంలో 45 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ నర్సరీ ద్వారా మెదక్ జిల్లాకు నాలుగు లక్షల నాణ్యమైన మొక్కలను అందించడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. మొదటి విడత లక్ష విత్తనాలు నాటుటకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. వచ్చే సంవత్సరం రైతుల పొలాల్లో నాటేందుకు సిద్ధమవుతాయన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు వినయ్ విన్సెంట్, రాజ్ నారాయణ, ఏఈఓ లు శ్రీలత, మౌనిక, రమ్య, రైతులు ఉన్నారు.

100 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు…

100 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు

జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునీల్‌కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

బుధవారం ఉద్యాన, వ్యవసాయ, సహకార శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఏ. సునీల్‌కుమార్, జిల్లా సహకార అధికారి వాలియా నాయక్, జిల్లా వ్యవసాయాధికారి జాడి బాపురావు హాజరైనారు ఈ కార్యక్రమంలో
జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఏ. సునీల్‌కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో ఉద్యాన శాఖ తరపున అమలవుతున్న వివిధ పథకాల ప్రయోజనాలు, భౌతిక లక్ష్యాలు, రైతులకు చేరే మద్దతు, అలాగే శాఖల సమన్వయం ద్వారా అమలులో వేగం పెరగాలని సూచించారు.
జిల్లా కోఆపరేటివ్ అధికారి వాలియా నాయక్ మాట్లాడుతూ, ప్రతి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏపీసీ నిర్దేశించిన విధంగా 100 ఎకరాల ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలని, మండలాల వారీగా రైతుల అవగాహన సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
ఈ సందర్భంగా ఉద్యాన శాఖ అధికారులు పథకాల లక్ష్యాలు, రాయితీలు, ప్రయోజనాలు, రైతులకు అందే లబ్ది గురించి ప్రజెంటేషన్ రూపంలో వివరణ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏడీఏలు, మండల వ్యవసాయ అధికారులు, ఉద్యాన శాఖ అధికారులు, సహకార సంఘాల సీఈఓలు, ఆయిల్ పామ్ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version