ఈవేస్ట్ తో పర్యావరణానికి ముప్పు.

MLA MLA

*ఈవేస్ట్ తో పర్యావరణానికి ముప్పు..

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేద్దాం..

స్వర్ణాంధ్ర…స్వచ్ఛ ఆంధ్ర మనందరి బాధ్యత..

స్వచ్ఛ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే అమర్..

పలమనేరు(నేటి ధాత్రి) ఏప్రిల్ 19:

 

 

ఎలక్ట్రానిక్ పరికరాల వేస్ట్ తో పర్యావరణానికి పెను ముప్పని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు పురపాలక సంఘ కార్యాలయంలో శనివారం స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం పై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్ధాలతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాల వ్యర్ధాలతో పర్యావరణానికి తీరని నష్టం వాటిల్లుతుందని మానవాళి మనుగడకే ప్రశ్నర్థకంగా మారుతుందన్నారు.ఈ వేస్ట్ వ్యర్థలతో పర్యావరణ సమతుల్యత పూర్తిగా దెబ్బతినే ఆస్కారముందన్నారు.

 

MLA
MLA

కాబట్టి ఈ వేస్ట్ వ్యర్థాలపై ప్రజల అవగాహన పెంచుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వర్ణాంధ్ర స్వచంద్ర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యలు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి గంగమ్మ గుడి వీధి మీదుగా అవగాహన ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్వీ.రమణారెడ్డి,మెప్మా సిటీ మిషన్ మేనేజర్ బాబా,మున్సిపల్ సిబ్బంది తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్బీసీ కుట్టి, గిరిబాబు,సుబ్రహ్మణ్యం గౌడ్, నాగరాజు,ఖాజా పీర్, చాంద్ భాషా, బీ.ఆర్.సి కుమార్,లోకేష్ ఆచారి,
సురేష్,మురళీ, చందు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!