ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి..
ఆర్కేపి ఎస్ఐ రాజశేఖర్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని రామకృష్ణాపూర్ పట్టణ ఎస్ఐ రాజశేఖర్ అన్నారు.పోలీసు సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తున్ను నేపథ్యంలో రోడ్డుకు వ్యతిరేక దిశలో నడుపుతున్న వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగిందని ఎస్సై తెలిపారు. అనంతరం ఎస్సై రాజశేఖర్ వాహనదారులకి కౌన్సిలింగ్ ఇచ్చి జరిమానా విధించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపితే ప్రమాదాలకు కారణమయ్యే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ అన్నారు.