
జమ్మికుంట: నేటిధాత్రి
జమ్మికుంట మండల పరిధిలోని నాగారం గ్రామంలో బుధవారం రోజున ఉదయం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో రామ కనకమ్మ. 75 సంవత్సరాలు రామ బోషయ్య 80 సంవత్సరాలు గల వృద్ధ దంపతులు నాగారం గ్రామంలో నివసిస్తున్నారు. గత కొంతకాలంగా రామ్ కనకమ్మ. అనారోగ్యం పాలై మంచానీకె. పరిమితమయింది, ఇట్టి క్రమంలో బుధవారం ఉదయం. ఇంట్లో పడుకొని ఉన్న వృద్ధ దంపతుల మీద వీధి కుక్కలు ఒకసారిగా దాడి చేశాయి. ఈ దాడిలో రామ కనకమ్మ కాలుకు పెద్ద గాయాలయ్యాయి, ఉదయం విషయం తెలుసుకున్న గ్రామస్తులు జమ్మికుంట 108 అంబులెన్స్ సర్వీస్ కు సమాచారం అందించడంతో హుటాహుటిన 108 అంబులెన్స్ సర్వీస్ నాగారం గ్రామానికి చేరుకొని ప్రధమ చికిత్స చేసిన అనంతరం వృద్ధ దంపతులను హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.