
మండల్ ప్రాథమిక పాఠశాలలో ముందస్తు రక్షాబంధన్
ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి
మండలంలో కోమటి కొండాపూర్ గ్రామంలో ప్రాథమికొన్నత లో పాఠశాలలో రాఖీ పౌర్ణమి ని పురస్కరించుకొని విద్యార్థినిలు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ముందస్తుగా రాఖీ కడుతూ” నేను, నీకు రక్ష, నీవు,నాకు రక్ష,మనమిద్దరం దేశానికి రక్షా” అంటూ వాగ్దానం చేయడం జరిగింది.ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాఖీ అనగా రక్షణ బంధం అన్నకు గానీ, తమ్మునికి గానీ ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషం అని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు సుధారాణి, విశాల్, నర్మద, జ్యోష్ణ, రాణి, లు పాల్గొన్నారు.