దుమ్మగూడెం..నందుల చలక పేరుతో రేగుబల్లిలో నడుపుతున్న ఇసుక ర్యాంపు లో మళ్లీ మొదలైన అధిక లోడు లారీలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…
భద్రాచలం నేటి ధాత్రి

ఇప్పటికైనా సంబంధిత అధికారులు రవాణా అధికారులు స్పందిస్తారా లేదా?

రేగుబల్లి ఇసుక ర్యాంపులో లోడ్ అవుతున్న ప్రతి లారీలో ఐదు నుంచి పది టన్నుల ఇసుకను ఎక్కువగా వేస్తున్నారు.

ఇసుక లోడ్ అయ్యేది రేగుబల్లిలో కానీ బరువు చూసేది మాత్రం పాల్వంచలో అంట?

అంతేకాకుండా కొసమెరుపు ఏమిటంటే ఆన్లైన్లో డిడి కట్టి వచ్చిన లారీ ఓనర్లు మరియు డ్రైవర్ల దగ్గర లోడింగ్ చార్జి పేరుతో 2500 నుంచి 3000 వసూలు చేస్తున్న ఆంధ్ర ఇసుక కాంట్రాక్టర్..

గ్రామపంచాయతీ అభివృద్ధికి లారీ వాళ్ల దగ్గర నుంచి 200 మరియు ఇసుక ర్యాంపు మెయింటినెన్స్ అని మరో 200 వసూలు చేస్తున్నారని లబోదిబోమని మొత్తుకుంటున్న లారీ ఓనర్లు మరియు డ్రైవర్లు

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రేగుబల్లి ఇసుక ర్యాంపులు జరిగే అవినీతి అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుకుంటున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *