క్షేత్ర స్థాయిలో బిందు సేద్యాన్ని పరిశీలించిన జిల్లా ఉద్యనవవ అధికారి.
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ ము, జహీరాబాద్ మరియు మొగుడంపల్లి మండలంలో బిందు సేద్యం తో పంటల సాగుకు పరిశీలించి న సంగారెడ్డి జిల్లా ఉద్యనవవ అధికారి సోమేశ్వర రావు.తెలంగాణ ఉద్యానవన శాఖ పథకం ద్వారా రైతులకు రాయితీ లపై అందజేసి న బిందు సేద్య పరికరాల వినియోగాన్నీ ప్రత్యేకంగా క్షేత్ర స్థాయిలోపర్యటించి తనిఖీ చేశారు. మండలం లోని మల్చేల్మా,మొగుడంపల్లి, చిన్న హైదరాబాద్ గ్రామాలలో ఆయన వ్యవసాయ భూములను సందర్శించి సూక్ష్మ సేద్య పరికరాలతో సాగులో ఉన్న పంట పొలాలను అమర్చిన పరికరాలను పరిశీలించి నారు. బిందు సేద్యాన్ని అమలు చేస్తున్న రైతులను ఉద్దేశించి ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ విధానం ద్వారా నీటినిపొదుపు చేసుకోవడం తో పాటు అధిక దిగుబడి సాధించవచ్చని వివరించారు.క్షేత్ర పర్యటన లో జైన్ డ్రిప్ డి సి ఓ విజయకుమార్, నేటఫీమ్ డిసిఓ పాండు,గొల్ల రాజరమేష్, స్వామి రైతులు అంజన్న,శ్రీనివాస్ లు పాల్గొన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్న రైతులు సంతోషం వ్యక్తం చేశారు