తొర్రూరు పట్టణంలో పిచ్చి కుక్కల స్వైరా విహారం

తొర్రూర్ (డివిజన్) నేటి ధాత్రి

ఒకేరోజు అంబేద్కర్ నగర్ లో అయిదుగురిని కరిచిన వైనం

ఉపయోగంలో లేని యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్

పట్టించుకోని అధికారులు, పాలకులు

భయబ్రాంతులకు గురవుతున్న పట్టణ ప్రజలు

సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న సామజిక కార్యకర్త మంగళపల్లి నాగరాజు

తొర్రూర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో పిచ్చికుక్కలు ఒకేరోజు అయిదుగురిని కరిచిన సంఘటన ఈరోజు చోటుచేసుకుంది. అందులో చిన్నపిల్లలు నలుగురు, పెద్దలు ఒకరు, రెండు మేకలను మూరగుండ్ల రుద్రదీప్(4),మంగళపల్లి చరిష్మా (2),హర్షిత్(2),ఫాయిదా (3),మంగళపల్లి అనిల్ (30) అత్యంత దారుణంగా కరిచాయి. చిన్న పిల్లాడిని జుట్టు పట్టుకొని కరుస్తున్నాయని అడ్డుకోబోయిన అనిల్ కూడా కరిచాయ్. పట్టణ కేంద్రంలో పిచ్చికుక్కలు రోజురోజుకి పెరుగుతున్న మున్సిపాలిటీ అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు.ఈలాంటి దారుణమైన ఘటనకు కారకులు నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్న మున్సిపల్ అధికారులు, పాలకులు పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేసారు.

కుక్కల పెరుగుదలను నివారించడం కోసం గతంలో ఏర్పాటు చేసిన యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ lo తూ తూ మంత్రాంగా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం దానిని ఉపయోగించకుండా చోద్యం చేస్తున్న మున్సిపాలిటీ అధికారులు, పాలకులు.ఇప్పటికైనా పట్టణ ప్రజల కోసం సరైన చర్యలు తీసుకోవాలని సామజిక కార్యకర్త మంగళపల్లి నాగరాజు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *