మానవత్వం చాటుకున్న కాంట్రాక్టర్ రాజు పాటిల్
◆:- పస్తాపూర్ కమాన్ నుండి మహేంద్ర కాలానికి వెళ్లే రోడ్డు వరకు
◆:- రోడ్డుపై ఉన్న గుంతలను జెసిపి తో పూడ్చివేత
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని పస్తాపూర్ కమాన్ నుండి మహేంద్ర కాలనీకీ వెళ్లే రోడ్డు వరకు గుంతలతో ఏర్పడి ప్రజలకు ఇబ్బందులు కలగడంతో మానవత్వం చాటుకొని జెసిబి సాయంతో రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చివేసిన కాంట్రాక్టర్ రాజు పాటిల్ బుధవారం సాయంత్రం రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చడంతో రోడ్డు పై వెళ్లే ప్రజలు రాజు పాటిల్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డు పై వర్షము నీళ్లు నిండి ప్రజలకు ఇబ్బందులు పడ్డారు.ఈ రోడ్డు గుండా ఝరాసంగం రాయికోడు మండలం లతో పాటు వివిధ గ్రామాలకు ప్రజలు వెళ్తుంటారు ఇటీవల ఓ దంపతులు బైక్ పై వెళుచుండగా లోతైన గుంతలు ఏర్పడడంతో బైక్ పై నుండి క్రిందపడి గాయాలు ఏర్పడ్డాయి పలుమార్లు గుంతలు ఏర్పడిన విషయం అధికారులకు తెలిపిన పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించారు దీంతో కనికరించిన రాజు పాటిల్ తన మంచి మనుస్సు తో ముందుకు వచ్చి జెసిపి సాయంతో గుంతలన్నిపూడ్చి తన మంచి మనుస్సు ను చాటుకున్నారు.