గ్రామాల సమగ్ర అభివృద్దె కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి
నల్లబెల్లి , నేటి ధాత్రి:
ప్రతి గ్రామ సమగ్ర అభివృద్దె ప్రజా పాలనలోని కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి అన్నారు.
మండలంలోని కొండైల్ పల్లి గ్రామంలో సర్పంచ్ స్వప్న నరేష్ ఆధ్వర్యంలో ఈజీఎస్ నిధుల నుండి మంజూరైన సిసి రోడ్డు పనులను గురువారం చిట్యాల తిరుపతిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రత్యేక చొరవతో మండలంలోని అన్ని గ్రామాలు సమగ్ర అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో మౌలిక వసతుల కల్పన పక్కా రోడ్ల ఏర్పాటే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని సంక్షేమ పథకాలు అమలు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమని ఆయన అన్నారు . ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పెంతల కొమర రెడ్డి ,బీసీ సెల్ మండల అధ్యక్షుడు కుసుంబ రఘుపతి ,మండల కార్యదర్శి జిల్లామునీందర్, నల్లబెల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ ,డేగల కృష్ణ ఎరుకల రవి, పంచాయతీ కార్యదర్శి రజిత,గ్రామస్తులు ప్రతాపరెడ్డి ,లక్ష్మణ్ రెడ్డి ఉపసర్పంచ్ నాగిరెడ్డి, అనంతరావులు ,కొనకటి రమేష్ ,వీరస్వామి, కీసరి రామ పెంతల విజయ, తదితరులు పాల్గొన్నారు.
