సంతాపం తెలిపిన ఎంపీ వద్దిరాజు

Date 02/03/2024
—————————————-
తన సహచర ఎంపీ దీవకొండ దామోదర్ రావు మాతృమూర్తి అండాళమ్మ మృతి పట్ల రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.సమాచారం తెలిసిన వెంటనే శనివారం ఉదయం బంజారాహిల్స్ లోని దామోదర్ రావు నివాసానికి వెళ్లి అండాళమ్మ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఎంపీ దామోదర్ రావు,వారి కుటుంబ సభ్యులు,బంధుమిత్రులను రవిచంద్ర పరామర్శించి,తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.అండాళమ్మ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు,మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్,కే.ఆర్.సురేష్ రెడ్డి తదితర ప్రముఖులు అండాళమ్మ భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.ఆమె కుమారుడు దామోదర్ రావు,వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *