ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ…
తంగళ్ళపల్లినేటిధాత్రి…..
తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ. నిరుపేద ప్రజలకు అత్యవసర సమయంలో చికిత్స చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారికి వైద్యం అందించే దిశగా ప్రభుత్వం పేద ప్రజలందరికీ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు రాష్ట్రంలోని ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తూ గ్రామంలోని ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగిందన మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నాయకులు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో తంగళ్ళపల్లి గ్రామ .సర్పంచ్.మోర లక్ష్మీరాజo.మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్. లింగాల భూపతి. సుద్దాల శ్రీనివాస్. బండి పరశురాములు. సామల గణేష్. పద్మశాలి సంఘం అధ్యక్షులు రాపేల్లిఆనందం. నాయకులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు
