తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సిఐటియుసికరపత్రిక ఆవిష్కరణ….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సిఐటియుసి ఆధ్వర్యంలో కరపత్ర o ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ. కార్మికుల హక్కుల సారధి పోరాటాల వారధి సిఐటియుసి రాజన్న సిరిసిల్ల జిల్లా నాలుగవ మహాసభలు నవంబర్ 30వ. తేదీన ఆదివారం రోజున సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఆర్ డి ఓ ఆఫీస్ నుండి పెద్ద ఎత్తున బహిరంగ సభ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని ఇట్టి మహాసభలకు సిఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రమ అక్క సిఐటియుసి రాష్ట్ర కార్యదర్శి రమేష్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్న సందర్భంగా తంగళ్ళపల్లి మండలం నుండి కార్మికులు బీడీ కార్మికులు ఆశా వర్కర్లు అమాలి సంఘం నాయకులు వస్త్ర వ్యాపార కార్మికులు కార్మికులందరూ తంగళ్ళపల్లి గ్రామం నుండి ఆర్ డి ఓ ఆఫీస్ నుండి పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి నాలుగవ మహాసభలు సిఐటియుసి ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుచు ఏఐటీయూసీ తరఫున మండల కేంద్రంలోని కరపత్రం విడుదల చేశామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో అన్ని రకాల సంబంధిత కార్మికులు పాల్గొన్నారు
