ప్రాథమిక గొఱ్ఱెకాపారుల సహకార సంఘం అధ్యక్షులుగా చుక్క మల్లేశం

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామ ప్రాథమిక గొఱ్ఱెకాపారుల సహకార సంఘం ఎన్నికల్లో సంఘం అధ్యక్షులుగా చుక్క మల్లేశం, ఉపాధ్యక్షులుగా దయ్యాల బక్కయ్య, డైరెక్టర్లుగా కచ్చు ఐలు, పెంటల మల్లయ్య, కాలువ కొమురయ్య, వేముండ్ల లక్ష్మీ, కోరే తారలు ఎన్నికయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఈఎన్నికల్లో సహకరించిన కుల సంఘం నాయకులకు, సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ, కుల సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈసందర్భంగా ఎన్నికల్లో విజయం సాధించిన వారికి కులసంఘం సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో పెద్ద కురుమలు, మాజీ అధ్యక్షులు ముత్త నరేష్, కచ్చు లింగయ్య, కెవైసిస్ మండల ప్రధాన కార్యదర్శి బండారి శ్రీనివాస్, గ్రామ అధ్యక్షులు ఎగుర్ల రవి,గుంటి రాజు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!