చలి మెడ.రాజేశ్వరరావు ఘనంగా జన్మదిన వేడుకలు…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి:
తంగళ్ళపల్లి మండలం. నేరెళ్ల గ్రామంలో. బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లో.కరీంనగర్ డైరీ యూనిట్.సూపర్వైజర్ గుర్రం సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో. కరీంనగర్ డైరీ చైర్మన్ చలి మెడ రాజేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరీంనగర్ డైలీ చైర్మన్ రాజేశ్వరరావు జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకోవడం జరిగిందని కరీంనగర్ డైరీ స్థాపించి డైరీ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అట్లాగే రోజుకు 2000 లీటర్ల నుండి రెండు లక్షల లీటర్ల వరకు పాల ఉత్పత్తిని పెంచిన ఘనత చైర్మన్ రాజేశ్వరరావు ది అని. మాకు పండుగ రోజు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పిల్లాపాపలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఇట్టి జన్మదిన వేడుకలను ఘనంగా జరిపించుకున్నామని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. బి సి యు ఇన్చార్జి రాగుల మధుసూదన్. సూపర్వైజర్ ఉమ్మారెడ్డి భానుచందర్. ల్యాబ్ అసిస్టెంట్ తిరుపతి. శేఖర్. నరేష్. శ్రీనివాస్. రాజు. సాయికుమార్ రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు