కేసీఆర్ సభ అంటేనే ప్రజలు పట్టే బ్రహ్మరథం!
-బీఆర్ఎస్ రజతోత్సవం… తెలంగాణ ప్రజల వేడుక వైభవం!
-బీఆర్ఎస్ రజతోత్సవం.. తెలంగాణ అంతటా పండగ వాతావరణం
ప్రతి ఒక్కరూ మా ఇంటి పండుగ అని వరంగల్ బయలుదేరుతున్నారంటున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు తో రజతోత్సవ సభ ఏర్పాట్లు, నిర్వహణపై ముచ్చటించిన విశేషాలు.
`బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం చేసేందుకు ప్రజలు కదులుతున్నారు
`కేసీఆర్ ను చూడాలని తెలంగాణ సమాజం ఎదురుచూస్తోంది
`కేసీఆర్ చెప్పే మాటలు వినాలని ప్రపంచం మొత్తం చూస్తోంది
`బీఆర్ఎస్ ను తెలంగాణ సమాజం మొత్తం ఆశీర్వదిస్తోంది
`తెలంగాణ కోసం కేసీఆర్ పడిన శ్రమకు నిదర్శనం రాష్ట్ర ఆవిర్భావం
`నిన్నటితరం గోసలు..నేటి తరం ఆశలు తీర్చిన పుణ్య పాలకుడు కేసీఆర్
`గుప్తుల కాలం పుస్తకాలలో చదువుకున్నాం
`ఆ స్వర్ణ యుగం కేసీఆర్ పాలనలో కళ్లారా చూశాం
`అరవై ఏళ్ల గోసను పదేళ్లలో తీర్చిన కేసీఆర్ అందించిన సంక్షేమం అందుకున్నాం
`కుటిల రాజకీయ కాంగ్రెస్ మోసం ఏడాదిగా అనుభవిస్తున్నాం
`ప్రజల మేలు కోరలేని కాంగ్రెస్ వల్ల నష్టపోతున్నాం
`తెలంగాణను తెర్లు చేస్తున్న కాంగ్రెస్ మీద మర్లపడదాం
`మళ్ళీ తెలంగాణ ఆత్మగౌరవం నిలుపుకుందాం
`కేసీఆర్ పాలన మళ్ల తెచ్చుకొని సుభిక్షమైన తెలంగాణ చూద్దాం
`కేసీఆర్ పాలనలో మళ్ల ప్రతి రోజు పండగ రైతుల కళ్లలో చూద్దాం
`బీఆర్ఎస్ రజతోత్సవానికి దండుగా కదులుదాం
`కేసీఆర్ నాయకత్వానికి మనమందరం సంఫీుభావం తెలుపుదాం
`మరోసారి తెలంగాణ ప్రగతికి పునరంకితమౌదాం
`జై కేసీఆర్, జై జై కేసీఆర్ అని జేజేలు పలుకుదాం
`రండి..కదలి రండి..లక్షలాదిగా వచ్చి వరంగల్ సభను విజయవంతం చేద్దాం
`మనమంతా తెలంగాణ కోసం కేసిఆర్ వెనకే వున్నామని నిరూపిద్దాం
`కాంగ్రెస్ గుండెల్లో నిద్రపోదాం..
`ఇక కాంగ్రెస్ కు నిద్రలేని రాత్రులు చూపిద్దాం
`బీఆర్ఎస్ బలమేమిటో రజతోత్సవ సభతో నిరూపిద్దాం
`ప్రజలారా…తరలిరండి…జై తెలంగాణ అని జై కొట్టండి
హైదరాబాద్,నేటిధాత్రి:
కాంగ్రెస్ అంటేనే ప్రజలకు కష్టాలు. కాంగ్రెస్ వస్తేనే ప్రజలు కన్నీళ్లు. కాంగ్రెస్ వచ్చిందంటేనే తెలంగాణకు కరవు. కాంగ్రెస్ అంటేనే తెలంగాణ తెర్లు. ఇది మరోసారి రుజువైంది. తెలంగాణ మళ్లోసారి తెర్లవుతోంది. పది సంవత్సరాలు కేసిఆర్ పాలనలో పచ్చగా వున్న తెలంగాణ మళ్లీ ఎండుతోంది. పండుటాకులా రాలిపోతోంది. రైతులు గోస పడుతున్నారు. సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. సంక్షేమం ఆగిపోయింది. అభివృద్ది కుంటుపడిపోయింది. ప్రగతి ఆనవాలు లేకుండాపోయింది. మళ్లీ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఎదుర్కొన్న సమస్యలు చుట్టుముట్టాయి. పాలన చేతగాని, ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన లేని కాంగ్రెస్ వల్ల తెలంగాణ ఎడారిగా ఏడాదిలోనే మారిపోయింది. సరిగ్గా ఏడాదిన్నర క్రితం వరకు తెలంగాణలో ఎటు చూసినా నీళ్లు. పచ్చనిపొలాలు. పాడిపంటలు సమృద్ది. రైతుల సంతోషాలు. కనిపించేవి. కాని కాంగ్రెస్ ప్రజలను మోసి అధికారంలోకి వచ్చిన మళ్లీ ప్రజలకు నీళ్లివ్వాల్సిన సమయంలో కన్నీళ్లు పెట్టుకునేలాచేస్తోంది. ప్రజలను ఆగమాగం చేస్తోంది. అందుకే తెలంగాణ ప్రజలు మా నాయకుడు కేసిఆర్ కావాలి. మా కేసిఆర్ మళ్లా రావాలి. మా కేసిఆర్ పాలన మేం చూడాలని కోరుకుంటున్నారు. ఏమరపాటుతో చేసిన చిన్న అలక్ష్యం..నిర్లక్ష్యం రూపంలో వేదించుకుతింటోంది. జనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పీడిరచుకుతింటోంది. అందుకే ప్రజలంతా రాక కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా బిఆర్ఎస్ నూరు స్ధానాలన గెలిపించేందుకు ప్రజలు సిద్దంగా వున్నారు. ఎందుకంటే కేసిఆర్ అంటేనే ఓ ప్రభంజనం. ఓ మలయమారుతం. ఆయన పాలనా కాలమంతా ప్రజలు చల్లగా వున్నారు. తెలంగాణ సుభిక్షంగా వుంది. కష్టాలు, కన్నీళ్లు దరి చేరకుండా కేసిఆర్ ప్రజలను కళ్లలో పెట్టుకొని చూసుకున్నాడు. తెలంగాణకు పదేళ్ల కాలంలోనే వందేళ్ల సంక్షేమాభివృద్ది అందించారు. ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకున్నాడు. తెలంగాణను పదేళ్లలో ఊహించనంత గొప్పగా తీర్చిదిద్దారు. అలా కళకళలాడుతున్న తెలంగాణపై కాంగ్రెస్ నాయకులు నిప్పులు పోసుకున్నారు. ఇలాగే కేసిఆర్ పాలన సాగితే మరో వందేళ్లయినా గెలవడం కష్టమనుకొని, లేనిపోని అబద్దాలు ప్రచారం చేశారు. మోసపు హమీలతో అదికారంలోకి వచ్చారు. ప్రజలను నిలువునా ముంచుతున్నారు. ఈ బాధలు భరించలేక ప్రజలు కేసిఆర్ ఓదార్పు కోసం చూస్తున్నారు. కేసిఆర్ ఇచ్చే ధైర్యం కోసం చూస్తున్నారు. కేసిఆర్ చెప్పే నాలుగుమాటలు వేదమంత్రాలుగా పనిచేస్తాయి. భవిష్యత్తు మీద భరోసా కల్గుతుందన్ననమ్మకంతో ప్రజలు వరంగల్ సభకు తండోప తండాలుగా వచ్చేందుకు కదులుతున్నారు. చీమల దండు భయలుదేరినట్లు బిఆర్ఎస్ రజతోత్సవ సభకు వచ్చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని వేల మంది అటు ఆదిలాబాద్ నుంచి మొదలు, ఇటు ఖమ్మం, నల్లగొండ, మహాబూబ్ నగర్లనుంచి బండెనుకు బండి కట్టుకొని బయలుదేరారు. కేసిఆర్ సభ అంటేనే ప్రజలు బ్రహ్మరథం పడతారని చెప్పడానికి ఎడ్ల బండ్ల మీద భయలుదేరిన రైతులే సాక్ష్యం. బిఆర్ఎస్ పార్టీ పుట్టి 25 వసంతాలు పూర్తవుతున్నాయి. ఈ ఇవరై ఐదుసంవత్సరాలలో పద్నాలుగు సంవత్సరాలు తెలంగణ ఉద్యమాన్ని భుజనా మోసింది. తెలంగాణ తెచ్చేదాకా, కేంద్రం ఇచ్చేదాకా కొట్లాడిరది. తెగించి పోరాటం చేసి, తెలంగాణ సాదించింది. తెలంగాణ కోసం ఉద్యమ రాజకీయ పోరాటంతో తెలంగాణ సాధించిన కేసిఆర్ పాలన పదేళ్లు సాగింది. మొత్తంగా ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ తన రజతోత్సవ వేడుకను వరంగల్ వేదికగా జరుపుకుంటోంది. బిఆర్ఎస్ రజతోత్సవం అంటేనే తెలంగాణ ప్రజలవేడుక వైభోగంగా కళ్లనిండా కనిపిస్తోంది. బిఆర్ఎస్ రజతోత్సవ వేళ తెలంగాణ అంతటా పండుగ వాతావరణం, బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల కోలాహలమే కనువిందు చేస్తోంది. ప్రతి పల్లె, పట్నం అన్న తేడా లేకుండా, ఉద్యమ కాలంలో సభలకు వచ్చినట్లే ఇంటికొకరు వచ్చేందుకు సిద్దమౌతున్నారు. లక్షల్లో వరంగల్ వైపు అడుగులేస్తున్నారంటున్న బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ , నేటి ధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావుతో పంచుకున్న ఆవిర్భావ సభ ముచ్చట్లు ఆయన మాటల్లోనే…
చాల కాలం తర్వాత కేసిఆర్ను కళ్లారా చూసుకోవాలని తెలంగాణ ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఉద్యమకాలంలో కూడా కేసిఆర్ చెప్పే మాటల కోసం తెలంగాణ ప్రజలే కాదు, ఆంద్రాకు చెందిన వాళ్లు, ప్రపంచమంతా ఎదురుచూసేది. తెలంగాణ వచ్చిన పదేళ్ల తర్వాత కూడా ఆయన మాటలు వినేందుకు ప్రపంచమంతాఎదురుచూస్తోంది. కేసిఆర్ అనే నాయకుడు కారణజన్ముడు. అందుకే కొన్ని కోట్ల మంది ప్రజలకు ఆరాధ్యుడయ్యారు. తెలంగాణ ప్రజల చేత కొలువబడుతున్నారు. తెలంగాణ సాధన అంటే ఆషామాషీగా జరిగిన వ్యవహారం కాదు. తెలంగాణ ఎవరో ఇచ్చిందికాదు. పద్నాలుగేళ్లపాటు, కేసిఆర్ అలుపెరగని పోరాటం చేయడం వల్ల వచ్చింది. తెలంగాణ సమాజమంతా కేసిఆర్తో నడవడం వల్ల వచ్చింది. నాలాంటి కొన్ని లక్షల మంది కార్యకర్తలు కేసిఆర్తో కలిసి కొట్లాడితే వచ్చింది. పద్నాలుగేళ్ల నిరంతర పోరాటం వల్ల తెలంగాణ వచ్చింది. తెలంగాణ కోసం కేసిఆర్ పడని కష్టం అంతా ఇంతాకాదు. ఎదుర్కొన్న సమస్యలు కూడా చిన్నవి కాదు. ఎన్నో బెదిరింపులు, ఎన్నో అదిరింపులు…ఎన్నో వేధింపుల మధ్య అదరకబెదరక కేసిఆర్ తెచ్చిందే తెలంగాణ. అందుకే కేసిఆర్ యుగపురుషుడయ్యారు. తెలంగాణ కోసమే పుట్టిన కారణజన్ముడని ప్రజలు కొనియాడుతున్నారు. తెచ్చిన తెలంగాణను పదేళ్లలో అన్ని రంగాలలో అభివృ ద్ది చేశారు. ఎవరూ ఊహించని విజయాలు తెలంగాణకు అందించారు. బంగారు తెలంగాణ ఆవిష్కరించారు. అసలు తెలంగాణ వస్తుందనే ఎవరూ అనుకోలేదు. కాని తెలంగాణ ప్రజల కల నెరవేర్చాలని కేసిఆర్ కంకణం కట్టుకొని, ఎత్తిన పడికిలి దించకుండా పద్నాలుగేళ్ల పాటు అలుపెరగని పోరాటం చేశారు. ఆత్మ త్యాగానికి కూడా సిద్దమయ్యారు. బతికినా, చచ్చినా తెలంగాణ రాష్ట్రంలోనే అని తెగించి కొట్లాడిని ఏకైక నాయకుడు కేసిఆర్ అందుకే తెలంగాణ వచ్చింది. ఆయన పాలనలోనే సుబిక్షమైంది. అందరూ చిన్న తనంలో గుప్తుల కాలం స్వర్ణయుగమని చదువుకున్నాం. కాని అది ఎలా వుంటుందో కూడా అప్పుడు అర్ధం తెలియదు. కాని కేసిఆర్ పాలనలా వుంటుందని తెలిసింది. గుప్తుల పాలనకు మించిన స్వర్ణయుగాన్ని ఆయన ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరి కళ్ల్లలో ఆనందం నింపారు. రైతులను రాజులను చేశారు. రైతు కష్టం తీర్చారు. తెలంగాణ లో సాగు అంటే భయపడి పారిపోయిన రైతులను మళ్లీ సాగులోకి రప్పించారు. వ్యవసాయం దండుగ కాదు..పండగ చేసి చూపించారు. తెలంగాణ భూముల్లో తొండలు కూడా గుడ్లు పెట్టవని ఎగతాళి చేసిన వారికి పుట్లకొద్ది పంటలు పండిరచి చూపించిన నాయకుడు , పాలకుడు కేసిఆర్. తెలంగాణలో సాగుకు నీరివ్వడం ఎవరి తరం కాదు. అని ఉమ్మడి పాలకులు తేల్చి చెప్పి, తెలంగాణను నిర్లక్ష్యం చేశారు. తెలంగాణ సాగుభూములను పడావు పెట్టారు. రైతును బికారిని చేశారు. రైతులును కూలీలుగా మార్చారు. వలవలు పోయేలా పొగ పెట్టారు. తెలంగాణ పల్లెలన్నీంటినీ ఉమ్మడి పాలకులు చిద్రం చేశారు. ప్రజలు చిత్రవధ అనుభవించారు. సరిగ్గా అదే పని మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ అదే విధానాన్ని అనుసరిస్తోంది. తెలంగాణ ప్రాజెక్టుల్లో నీళ్లులేకుండా చేశారు. తెలంగాణకు కల్పతరువు లాంట కాళేశ్వరాన్ని ఎండబెట్టారు. ఏదో సాకు చెప్పి ఏడాది కాలంగా చుక్క నీరు నిలవకుండా కుట్ర చేశారు. తెలంగాణ రైతాంగానికి తీరని అన్యాయం కాంగ్రెస్ సర్కారు చేస్తోంది. గెలిపించిన పాపానికి తెలంంగాణ ప్రజలకే చుక్క నీరందరకుండా చేస్తోంది. రైతుల కళ్లలో మళ్లీ నీరు చూస్తున్నారు. పొలాల్లోపారాల్సిన నీరు రైతుల కళ్లలో చూస్తూ పాశవికానందాన్ని కాంగ్రెస్ పాలకులు పొందుతున్నారు. తెలంగాణను తెర్లుచేస్తున్న కాంగ్రెస్ మీద మర్లవడదాం…మళ్ల మన కేసిఆర్ పాలన తెచ్చుకుందాం..సుభిక్షమైన తెలంగాణ మళ్ల మన కళ్లారా చూసుకుందాం..బిఆర్ఎస్ రజతోత్సవ సభకు దండుగా తరలిరండి..