ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న దేశం

మరచిపోలేని విధంగా పాకిస్తాన్‌ను శిక్షించాలి

ముక్త కంఠంతో కోరుతున్న దేశం

భారత్‌తో తక్కువ స్థాయి యుద్ధాన్ని కోరుకుంటున్న అసిం మునీర్‌

అంతర్గత సమస్యలనుంచి బయటపడేందుకే

సైన్యాన్ని చీదరించుకుంటున్న పాక్‌ ప్రజలు

హిందూ, ముస్లిం సంప్రదాయాల ప్రస్తావన భారత్‌ను రెచ్చగొట్టేందుకే

అసిమ్‌ మునీర్‌ ప్రకటన తర్వాతే ఉగ్రదాడి

హిందువులనే టార్గెట్‌ చేస్తూ హత్యలు

విషాదాన్ని మిగిల్చిన సంతోష క్షణాలు

కొత్త జంటల జీవితాలను ఛిద్రంచేసిన ఉగ్రవాదులు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఏప్రిల్‌ 22న దక్షిణ కశ్మీర్‌కు చెందిన పహల్గామ్‌లోని బైసరాన్‌ పచ్చిక మైదానంలో జరిగిన ఉగ్రఘాతుకంలో 27మంది హిందువులు ప్రాణాలు కోల్పోవడంతో దేశం ఆగ్రహావేశాలతో అట్టుడికి పోతున్నది. లష్కరే తోయ్‌బా సీనియర్‌ కమాండర్‌ సైఫుల్లా కసౌరీ ఈ దారుణానికి ప్రణాలిక ర చించినట్టు అనుమానిస్తున్నారు. ఈ సంస్థ అధినేత హఫీజ్‌ సయీద్‌కు ఇతడు అత్యంత సన్నిహి తుడు. ఉగ్ర ఘటన నేపథ్యంలో పాకిస్తాన్‌కు మరచిపోలేని విధంగా శిక్షించాలన్న అభిప్రాయాలు గట్టిగా వ్యక్తమవు తుండటం సహజమే. గతంలో బాలాకోట్‌ దాడులు, సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసినప్పటికీ పాకిస్తాన్‌ ఎంతమాత్రం తన బుద్ధిని మార్చుకోలేదన్న విషయాన్ని ఈ సంఘటన మరోసారి స్పష్టం చేసింది. లోతుగా విశ్లేషిస్తే, దివాలా అంచున వుండి, బచ్చపట్టుకొని ప్రపంచదేశాల వద్ద అప్పులకోసం అగచాట్లు పడుతున్న పాకిస్తాన్‌ నిజానికి ఇటువంటి దుస్సాహసానికి ఒడిగట్టే అవకాశం లేదు. ఎందుకంటే భారత్‌ ప్రతీకార చర్యను ఎదుర్కొనే సామర్థ్యం దానికి లేదు. ఆవిషయం అక్కడి సైన్యానికి కూడా బాగా తెలుసు! అటువంటప్పుడు ఎందుకని ఇటువంటి దుస్సాహసానికి పాల్పడిరదనేది ఎవరికైనా సహజంగా వచ్చే సందేహం. ఇందుకు జాగ్రత్తగా విశ్లేషిస్తే సమాధానాలు దొరుకుతాయి. ఇటీవల పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌ తన ప్రసంగంలో కశ్మీర్‌ తమకుజుగులర్‌ నాడి వంటిదని వెల్లడిరచారు. దీన్ని అరిగిపోయిన రికార్డుగా చాలామంది కొట్టిపారేశారు. నిజానికి ఇక్కడ మునీర్‌ అన్నమాటలను పరిశీలిస్తే, ‘హిందువులు’ మరియు ‘ముస్లిం’ సంప్రదాయాలు భిన్నమని పేర్కొ నడమే కాదు, ద్విజాతి సిద్ధాంతాన్ని మరోసారి సమర్థిస్తూ మాట్లాడా రు. అంటే ఇక్కడ కశ్మీర్‌తో పాటు హిందువులపై విద్వేషాన్ని వెళ్లగక్కిన కొద్దిరోజులకే పహల్గామ్‌లో పర్యాటక ఆనందాన్ని ఆ స్వాదిస్తున్న సామాన్య హిందువులపై ప్రధానంగా పురుషులను టా ర్గెట్‌ చేసి మరీ దారుణంగా ఉగ్రవాదులు పొట్టనపెట్టుకోవడం ఇక్కడ కీలకం. పాకిస్తాన్‌ను ఏకతాటి మీదికి తీసుకురావాలంటే అక్కడి రాజకీయ నాయకులు లేదా సైన్యానికి భారత్‌ను తెరమీదికి తీసుకు రావడమే మార్గం. ఇది తప్ప వారికి మరోదారి లేదు. భారత్‌ పట్ల నరనరానా విషాన్ని నింపుకున్న అత్యధికశాతం పాకిస్తానీలకు హిందువులంటే విపరీతమైన ద్వేషం.ఈ బలహీనతను రెచ్చగొట్టడం ద్వారా పాక్‌ రాజకీయ నాయకులు, సైన్యం తమ పబ్బం గడుపుకుంటూ వస్తున్నాయి.

అసలు నిజం తెలుసుకున్న పాక్‌ ప్రజలు

ఇటీవలికాలంలో సోషల్‌ మీడియా పుణ్యమాని రాజకీయ నాయకులు, సైన్యం ఎప్పటికప్పుడు కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తడం, భారత్‌పై విద్వేషాన్ని వెళ్లగక్కడం ద్వారా తమను మోసం చేస్తున్నార న్న సంగతి పాక్‌ ప్రజలకు బాగా అర్థమైంది. ముఖ్యంగా ఇటీవల పాక్‌లో బెలూచ్‌ వీరులు ఏకంగా రైలునే హైజాక్‌ చేసి, రెండువందలమంది సైనికులను హతం చేయడం, సైనిక స్థావరాలపై బెలూచ్‌ తిరుగుబాటు దారులు విజయవంతంగా చేస్తున్న దాడులు, బెలూచ్‌ ప్రాంతాలకు సైనికులు వెళ్లలేని పరిస్థితులు, వాయువ్య సరిహద్దు ప్రాంతాల్లో దాదాపు 40శాతం భూభాగం ఆఫ్గనిస్తాన్‌ తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిందన్న వార్తలతో పాకిస్తాన్‌ ప్రజలకు అసలు వాస్తవాలు తెలిసిరావ డం మొదలైంది. ముఖ్యంగా అసిమ్‌ మునీర్‌ చేతగానితనాన్ని అక్కడి ప్రజలు తీవ్రంగా నిరసిస్తు న్నారు. ప్రస్తుతం బెలూచిస్తాన్‌, పీఓజేకేల్లో అల్లర్లు, ఏకంగా సైనికులపైనే దాడులు, పంజాబ్‌ ఆధిపత్యంపై సింధ్‌ ప్రజల్లో వ్యక్తమవతున్న ఆందోళన, నిరసన ప్రదర్శనలు ఒకవైపు, మరోవైపు పాకిస్తాన్‌ అంతర్జాతీయంగా ఏకాకి కావడం, ఒకప్పుడు ముస్లిం దేశాల్లో అణ్వస్త్రాలు కలిగిన దే శంగా ఆధిపత్యాన్ని ప్రదర్శించిన పాక్‌ సైన్యం డొల్లతనం బయటపడటం వంటి అంశాలు అసీంమునీర్‌కు ఎంతమాత్రం కొరుకుడు పడని అంశాలు. 

ఇటువంటి పరిస్థితుల్లో ‘భారత్‌ బూచి’ మాత్రమే తమను ప్రస్తుత కష్టాలనుంచి గట్టెక్కించే మార్గ మని తలచి ‘హిందూ’, ‘ముస్లిం’ సంప్రదాయాలలోని భిన్నత్వమనే కొత్త అంశాన్ని లేవనెత్తారు. ఇక్కడ కశ్మీర్‌ అంశాన్ని ప్రధానంగా లేవనెత్తడం వల్ల ప్రయోజనం వుండదన్న ఉద్దేశంతో బహుశా ఆయన దీంతోపాటు, రెండు మతాల సంప్రదాయాలను ముందుకు తెచ్చినట్టుగా భావించాలి. ఇందులో భాగంగానే తమకు అనుకూల ఉగ్రవాద గ్రూపుల ద్వారా కశ్మీర్‌లో ‘హిందువులను’ హతమార్చడం ద్వారా పాక్‌ ప్రజలనుంచి సానుకూలతను పొందే యత్నంగా కూడా దీన్ని పరిగణిం చవచ్చు. ప్రస్తుత భారత ప్రభుత్వం గతానికి భిన్నంగా కఠిన వైఖరి అవలంబిస్తుందన్న సంగతి తెలుసు కనుక అసీమ్‌ మునీర్‌ ఈవిధంగా రెచ్చగొట్టి భారత్‌ను ఏదోవిధంగా కయ్యానికి దిగేవి ధంగా చేయాలన్న ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. పూర్తిస్థాయి యుద్ధం కాకపోయినా, కొద్దిస్థా యి సంఘర్షణ జరిగేలా చేసి పాక్‌ ప్రజల్లో తానొక హీరోగా నిలవాలన్న కాంక్ష కూడా అసిమ్‌ మునీర్‌కు వుండవచ్చు. కానీ ఈ దుశ్చర్యవల్ల కలిగే దీర్ఘకాల దుష్ఫలితాలకంటే, తాత్కాలిక ఉప శమనానికే ఆర్మీ చీఫ్‌ ప్రాధాన్యత ఇచ్చారని భావించాలి.

నిజం చెప్పాలంటే 370 అధికరణం రద్దు తర్వాత క్రమంగా ఇస్లామిక్‌ దేశాలు, ఇతర అంతర్జాతీయ సంస్థలు కశ్మీర్‌ అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం మానేశాయి. ఫలితంగా అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్‌ అంశాన్ని ఒక అరిగిపోయిన రికార్డు మాదిరిగా ఎన్నిసార్లు వినిపించినా ఆలకించేనాధుడే కరవయ్యాడు. ఆవిధంగా పాక్‌ ఈ విషయంలో ఏకాకిగా మిగిలింది. ఇదే సమయంలో జమ్ము`కశ్మీర్‌లో ఎన్నికలు జరగడం, పర్యాటకరంగం బాగా ఊపందుకోవడం, పాకిస్తాన్‌కు కొ రుకుడు పడటంలేదు. ఇదేసమయంలో అంతర్గతంగా దేశం అల్లకల్లోలంగా మారడం, సైన్యం తన పలుకుబడిని కోల్పోతున్న నేపథ్యంలో, అసిమ్‌ మునీర్‌ ఈసారి కొత్తగా ‘హిందూ’, ‘ముస్లిం’ సంప్రదాయాల పేరుతో కొత్త పల్లవి ఎత్తుకున్నారని భావించాల్సి వుంటుంది. 

భారత్‌ ప్రతీకారం

అమాయక హిందూ పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాద చర్యకు ప్రతీకారంగా భారత్‌ పాకిస్తాన్‌పై తక్షణం తీసుకున్న ఐదు చర్యల్లో సింధూనదీ జలాల ఒప్పందం కీలకం. మిగిలిన వాటిల్లో వీసాల రద్దు, దౌత్యవేత్తల కుదింపు వంటివి మామూలుగా జరిగేవే. 1960లో రెండు దేశాల మధ్య జరిగిన ఈ సింధూనదీ జలాల ఒప్పందం ద్వారా అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నె హ్రూ పాకిస్తాన్‌ పట్ల ‘అపరిమిత’ ఉదారంగా వ్యవహరించారన్న విమర్శలు వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు కశ్మీర్‌లో ఎన్ని ఉగ్ర సంఘటనలు జరిగినా, పాకిస్తాన్‌తో నాలుగు యుద్ధా లు జరిగినా భారత్‌ ఎప్పుడూ సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దుచేయలేదు. సంయమనంతోదాన్ని కొనసాగిస్తూనే వచ్చింది. నేటికి సహనం చచ్చిపోయిన భారత్‌ ఈ ఒప్పందాన్ని ‘సస్పెండ్‌’ చేసింది. గతంలో ఈ ఒప్పందం కారణంగా కిషన్‌గంగ వంటి ప్రాజెక్టుల్లో ఎప్పటికప్పుడు పూడికను తొలగించి నీటితో నింపడానికి వీలయ్యేది కాదు. ముఖ్యంగా దిగువ ప్రాంతంలోని పాక్‌ రైతుల ఇబ్బందులను దృష్టిలో వుంచుకొని, నీటి విడుదల కొనసాగేది. ఇప్పుడు ఈ ఒప్పందం రద్దు తో ఈ అడ్డంకి తొలగింది. అంతకుముందు మాదిరిగా సింధూ, జీలం, చీనాబ్‌ నదుల వరదల కు సంబంధించి పాకిస్తాన్‌తో సమాచారాన్ని పంచుకునేది. ఇప్పుడు ఇది నిలిచిపోయింది. పాకి స్తాన్‌ ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్న కారణంగా ముందుకు సాగని కిషన్‌గంగ, బాగ్లిహార్‌, రాటిల్‌వంటి ప్రాజెక్టుల పనులు మరింత ఊపందుకుంటాయి. ఒప్పందం కారణంగా ముఖ్యంగా జీలం,చీనాబ్‌ నదీ ప్రాజెక్టుల్లో ఒక పరిమితికి మించి నీటి నిల్వ సాధ్యమయ్యేది కాదు. ఇప్పుడా సమస్యతీరిపోయింది. అయితే ఒప్పందాన్ని ‘సస్పెండ్‌’ చేయడం వల్ల ఒప్పందాన్ని పూర్తిగా రద్దుచేసినట్టుకాదు. కాకపోతే ఈ చర్య వల్ల పాకిస్తాన్‌పై మనదేశం ఒత్తిడి తీవ్రతను బాగా పెంచగలుగుతుంది. జమ్ము`కశ్మీర్‌ పశ్చిమ ప్రాంతంలో నత్తనడకన నడుస్తున్న అనేక ప్రాజెక్టులను మరింత వేగంగా భారత్‌ పూర్తిచేయగలుగుతుంది. అయితే ఇవన్నీ జరగడానికి చాలా సమయం పట్టవచ్చు. మొత్తంమీద చెప్పాలంటే అసిం మునీర్‌, తాత్కాలిక ప్రయోజనం కోసం చేపట్టిన రెచ్చగొట్టే చర్య ఇప్పుడు పాకిస్తాన్‌లోని పంజాబ్‌ ప్రాంతం మొత్తం నీటి ఎద్దడితో ఎండిపోయే పరిస్థితికి దారితీ సింది. ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడతాడంటే ఇదే మరి!

పీఓజేకేలో కొనసాగుతున్న ‘ఉగ్ర’ క్యాంపులు

నిఘావర్గాల సమాచారం ప్రకారం 150`200 మంది సుశిక్షితులైన ఉగ్రవాదులు, పాక్‌ సైన్యం సహాయంతో జమ్ము`కశ్మీర్‌లోకి ప్రవేశించడానికి సిద్ధంగా వున్నారు. నియంత్రణ రేఖకు సమీపంలోని పీఓజేకేలో 42 ఉగ్ర క్యాంపులు చురుగ్గా వున్నట్లు భారత నిఘావర్గాలు అంచనా వేస్తున్నా యి. కశ్మీర్‌లోయలో 70మంది, జమ్ము, రాజోరీ, పూంచ్‌ ప్రాంతాల్లో 60`65మంది ఉగ్రవాదు లు చురుగ్గా వున్నట్టు, వీరిలో 115మంది పాక్‌ జాతీయులన్న అనుమానాలున్నాయి. ఇప్పటికే జమ్మూకు చెందిన ఐదు జిల్లాలు, కశ్మీర్‌లోని బారాముల్లా, బండిపుర, కుప్వారా, కుల్గామ్‌ జిల్లాల్లో పనిచేస్తున్న విదేశీ ఉగ్రవాదుల్లో చాలామందిని భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ముఖ్యంగా బారాముల్లా జిల్లాలో నిర్వహించిన 9 ఆపరేషన్లలో 14మంది విదేశీ ఉగ్రవాదులను భద్రతా దళాలుహతమార్చాయి. ఇదిలావుండగా ఏప్రిల్‌ 24 ఉదయం నుంచి ఉధంపూర్‌ జిల్లాలోని బసంత్‌గఢ్‌ ప్రాంతంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్‌ మొదలైనట్టు వార్తలు వస్తున్నా యి. భారత సైన్యానికి చెందిన రోమియో ఫోర్స్‌, జమ్ము కశ్మీర్‌ పోలీసు దళానికి చెందిన స్పెషల్‌ ఆపరేషన్స్‌ ఫోర్స్‌లు గత పదిరోజులుగా లాసానా అటవీ ప్రాంతంలో తీవ్రంగా గాలింపు చర్య లు కొనసాగిస్తున్నాయి. ఏప్రిల్‌ 14న ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు భద్రతాదళాపై కాల్పులు జరపడంతో అప్పటినుంచి ఈ అటవీ ప్రాంతాల్లో కూంబింగ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. దట్టమైన అటవీ ప్రాంతాలు, కఠినమైన భౌగోళిక స్వరూపం ఈ ఆపరేష్లన్లకు ప్రధాన అడ్డంకిగా మారింది.ఇదిలావుండగా పహల్గామ్‌ సంఘటన తర్వాత బారాముల్లా జిల్లాలో ఏప్రిల్‌ 23న మనదేశంలోకిప్రవేశిస్తున్న ఉగ్రవాదుల్లో ఇద్దరిని భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ప్రస్తుతం పహల్గామ్‌ ప్రాంతంలో శ్మశాన ప్రశాంతి కనిపిస్తోంది. బాధితులకు సంఫీుభావంగా ఈ ప్రాంతంలోని వ్యాపారులు, పౌరసంఘాలు ఒకరోజు బంద్‌ పాటించాయి. బారాముల్లా, పూంచ్‌, శ్రీనగర్‌ మరియు ఖాడ్‌ గ్రామంలో ప్రజలు కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. 

 ఉగ్రవాదులకు ఆత్యాధునిక పరికరాలు

దేశంలోకి ప్రవేశిస్తున్న ఉగ్రవాదులు గతంలో మాదిరిగా కాకుండా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానా న్ని వాడుతుండటం గమనార్హం. నలుగురైదుగురు ఒక గ్రూపుగా ఏర్పడి అంచెలంచెలుగా మనదేశంలోకి ప్రవేశించడం ఒక వ్యూహం. వీరు స్థానిక జనాభాతో చాలా కాలం కలివిడిగా వుండటంతో భద్రతా దళాలకు వీరిని కనిపెట్టడం కష్టంగా మారింది. ఆధునిక రైఫిల్స్‌, నైట్‌ విజన్‌ గాగుల్స్‌, అత్యాధునిక టెలికాం పరికరాలు వీరు వాడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పాక్‌ సై న్యం వద్ద మాత్రమే వుండే ఇటువంటి చైనా తయారీ పరికరాలను ఉగ్రవాదులకు అందజేస్తుండ టం తాజా పరిణామం. 

రైల్వేల ముందుజాగ్రత్త చర్యలు

పహల్గామ్‌ సంఘటన తర్వాత భారతీయ రైల్వే అధికార్లు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఇటీవల ప్రారంభించిన ఉధంపూర్‌ాశ్రీనగర్‌ాబారాముల్లా మధ్య 272 కిలోమీటర్ల రైల్వే మార్గంపై భ ద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం ఈ మార్గంలో రెండు సెగ్మెంట్లుగా రైళ్లు నడుస్తున్నాయి. మొదటిది సంగల్డన్‌ నుంచి బారాముల్లా (184కి.మి) ఒక సెక్షన్‌ కాగా, ఉధం పూర్‌ాకాట్రా (25కి.మి.) మరో సెక్షన్‌. ఈ రెండు లైన్లను అనుసంధానించడం ద్వారా రైళ్లను నడుపుతున్నారు. కాట్రాసంగల్డన్‌ మధ్య 63 కిలోమీటర్ల రైలు మార్గానికి ప్రారంభోత్సవం జరగా ల్సివుంది. ఏప్రిల్‌19న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఈ రైలు మార్గాన్ని కూడా ప్రధాని నరేం ద్రమోదీ ప్రారంభించాల్సి వుంది. వాతావరణం బాగాలేకపోవడంతో ఈ కార్యక్రమం వాయిదా పడిరది. కాట్రాబనీహాల్‌ సెక్షన్‌లోని 111 కిలోమీటర్ల ప్రాంతం అత్యంత కీలకమైంది. ప్రపంచంలో ఎత్తయిన చీనాబ్‌ వంతెన, దేశంలోనే అత్యంత పొడవైన (12.7 కి.మి.) సొరంగం ఈ సెక్షన్‌ లోనే వున్నాయి. 

ప్రధాని నరేంద్రమోదీ హెచ్చరిక

పహల్గామ్‌ సంఘటనకు కారకులైనవారు, అందుకు కుట్రలు పన్నివారిని అంచనాలకు అతీతం గా శిక్షించి తీరతామని ప్రధాని నరేంద్రమోదీ ఏప్రిల్‌ 24న బిహార్‌లోని మధుబనిలో జరిగిన ఒకసమావేశంలో హెచ్చరించారు. మానవత్వ సమర్థకులు మాతోనే వున్నారు, దేశం యావత్తూ ఒక్క తాటిపై నిలిచింది. శిక్ష పడకుండా ఉగ్రవాదులు తప్పించుకోలేరు. 140కోట్ల మంది ప్రజల ఆత్మ విశ్వాసమే ఉగ్రవాద వెన్నెముకను విరిచేస్తుందని అన్నారు. ప్రధాని హెచ్చరికతో ప్రభుత్వం మరో కఠినచర్యకు ఉపక్రమించనున్నదనేది స్పష్టమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!