అర్బన్ బ్యాంక్ చైర్మన్, వైస్ చైర్మన్ లు ఏకగ్రీవం

చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ అడ్డగట్ల మురళి

సిరిసిల్ల(నేటి ధాత్రి):
సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా రాపెల్లి లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ గా అడ్డగట్ల మురళిలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు బి ఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిపారు. గురువారం అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో 12 డివిజన్లకు గాను ఎనిమిది మంది
బి ఆర్ఎస్ కు చెందిన అభ్యర్థులు గెలుపొందడంతో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వీరిద్దరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు బిఆర్ఎస్ నాయకులు తెలిపారు. సాయంత్రం బిఆర్ఎస్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, టీఎస్ పిటిడిసి మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్లు, బొల్లి రామ్మోహన్, దార్నం లక్ష్మినారాయణ, బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్, బి.ఆర్.ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *