వైద్య సేవలు ప్రజలకు తెలియాలి
మహబూబాబాద్,నేటిధాత్రి: ప్రభుత్వపరంగా నిరుపేదలకు అందించే వైద్య సేవలు ప్రజలకు తెలియాలని జిల్లా కలెక్టర్ శశాంక డాక్టర్లకు సూచించారు.గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ … ప్రభుత్వ ఆసుపత్రిలో నిరుపేదలకు లభించే వైద్య సేవలు తెలిసేలా చర్యలు తీసుకోవాలన్నారు.హాస్పిటల్ కాంపౌండ్ పరిశీలిస్తూ హాస్పటల్ నిర్వహణ తీరును మెరుగుపరచాలన్నారు.ద్విచక్ర వాహనాలను ఆసుపత్రి వెనుక భాగంలో ఉన్న స్థలాన్ని ద్విచక్ర వాహనాల పార్కింగ్ కు కేటాయించాలన్నారు.డాక్టర్లతో కలిసి ఆర్థోపెటిక్ వార్డును సందర్శించి…