మంథని అసెంబ్లీ ఇంచార్జ్ సునీల్ రెడ్డి పిలుపు..

మేధావులారా.. ఉపాధ్యాయులారా
ఆలోచించండి..ఆదరించండి..

ఎమ్మెల్సీ ఓటర్లకు పెద్దపల్లి జిల్లా మాజీ అధ్యక్షులు ,మంథని అసెంబ్లీ ఇంచార్జ్ చంద్రుపట్ల సునీల్ రెడ్డి పిలుపు.

మంథని :- నేటి ధాత్రి

మంథని నియోజకవర్గంలో టీచర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్కా కొమురయ్య లకు మద్దతుగా పార్టీ నాయకులతో కలిసి మంథని పట్టణం లో సునీల్ రెడ్డి ఎంఎల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించి అభ్యర్థులకు మీ ప్రాధ్యాన్యత ఓటు వేయాలని పిలుపునిచ్చాడు.నమ్మించి మోసం చేస్తున్న కాంగ్రెస్ కు బుద్ధి రావాలంటే ఈ ఎన్నికల్లో బీజేపీనీ గెలిపించాలి చట్టసభల్లో మీ తరపున ప్రశ్నించే గొంతులు ఉండాలంటే బీజేపీ ఎంఎల్సీ అభ్యర్థులు గెలవాల్సిందే మోసం చేసిన కాంగ్రెస్ కు ఓటుతో గుణపాఠం చెప్పాలని ఈ గెలుపు చాలా కీలకం మేదావులంతా తెలంగాణ భవిష్యత్ ను నిర్ణయించే ఎన్నికలు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులను వల్ల భవిష్యత్ కోసం బీజేపీ నీ గెలిపించండి అంటూ 317 జీవో కి వ్యతిరేకంగా బిజెపి పోరాటం చేసింది నీరుద్యోగ సమస్యలపై బిజెపి చేసినా పోరాటాలను ఓటర్లు గమనించాలని అన్నారు
ఆదిశగా మేధవులంతా.. ఆలోచిస్తారని.. పార్టీ అభ్యర్థులను ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాము రాబోయే రోజుల్లో బీజేపీ గెలుపు తధ్యం ఓటర్లుఅంతా మీ మొదటి ప్రాధాన్యత ఓటును అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్య లకు వేసి మద్దతు తెలపాలని కోరారు ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు చల్ల నారాయణ రెడ్డి ,బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి మంథని అసెంబ్లీ ఎంఎల్సీ ఎన్నికల ప్రభారీ నీలకంఠం పాండు ,ఎంఎల్సీ అసెంబ్లీ కన్వీనర్ బిరుదు గట్టయ్య ,అసెంబ్లీ కో కన్వీనర్ నాంపల్లి రమేష్ ,మంథని పట్టణ ,మండల అధ్యక్షులు సంతోష్ ,రాజేందర్,జిల్లా కౌన్సిల్ సభ్యులు బోగోజు శ్రీనివాస్ ,మంథని మాజీ పట్టణ అధ్యక్షులు ఎడ్ల సదాశివ్ ,కామన్పూర్ మండల ఇంచార్జి చిలువేరి సతీష్ సీనియర్ నాయకులు సామల అశోక్ ,నరమళ్ల కృష్ణ,లక్ష్మణ్, ఎడ్ల సాగర్ ,శ్రవణ్ ,సత్యం,అయింటి మల్లేష్ ,మహేష్ ,కార్యకర్తలు పాల్గొన్నారు.

డాక్టర్ వెంకన్న పరిశోధనకు దక్కిన పేటెంట్..

డాక్టర్ వెంకన్న పరిశోధనకు దక్కిన పేటెంట్

అభినందించిన సికెఎం కళాశాల ప్రిన్సిపాల్ శశిధర్ రావు

నేటిధాత్రి, వరంగల్

వరంగల్ లోని సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జంతుశాస్త్ర విభాగంలో, అతిథి అధ్యాపకుడిగా పనిచేస్తున్న డాక్టర్ లునావత్ వెంకన్న ఔషధ మొక్కల నుండి తయారుచేసిన రసాయనాల బయలాజికల్ యాక్టివిటీస్ పై, చేసిన పరిశోధనలకు గాను భారత ప్రభుత్వo ఇటీవల పేటెంట్ మంజూరు చేసింది. ఈ మేరకు సికేఎం కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య జి.శశిధర్ రావు డాక్టర్ వెంకన్నను అభినందించారు. ఈసందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పరిశోధనలకు పేటెంట్ లభించడం ఎంతో అభినందనీయమని తెలిపారు. ఇలాంటి అంశాలను అధ్యాపక బృందం స్పూర్తిగా తీసుకొని సికెఎం కళాశాలలో పరిశోధన రంగాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. పేటెంట్ సాధించిన వెంకన్న కేయూ జంతుశాస్త్ర విభాగం ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి పర్యవేక్షణలో పిహెచ్ డి, పిడిఎఫ్ పూర్తి చేశారని తెలిపారు. అదేవిధంగా తెలుగు విభాగంలో అతిథి అధ్యాపకురాలిగా పనిచేస్తున్న ఎం.మాధవి అత్యంత ప్రతిష్టాత్మకమైన యుజిసి నెట్ డిసెంబర్ 2024న జరిగిన పరీక్షలో క్వాలిఫై అయినందుకు సికెఎం కళాశాలకు గర్వకారణమని ప్రిన్సిపల్, అధ్యాపకులు,, బోధనేతర సిబ్బంది మాధవిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ .ధర్మారెడ్డి, డాక్టర్ వరప్రసాద్, గ్రంథపాలకులు ఎస్ అనిల్ కుమార్, కెప్టెన్ డాక్టర్ పి సతీష్ కుమార్, సూపరిండెంట్ జి శ్రీనివాస్, జ్ఞానేశ్వర్, పాషా , అతిధి అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.

వనపర్తి అభివృద్ధికి అడ్డుపడద్దు..

వనపర్తి నియోజకవర్గానికి అభివృద్ధికి అడ్డుపడద్దు

ఎమ్మెల్యేకు సవాల్ విసిరిన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి
వనపర్తి నేటిధాత్రి ;

వనపర్తి నియోజకవర్గం అభివృద్ధికి అడ్డు పడ వద్దని రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి కి సవాల్ విసిరారు ఆదివారం సాయంత్రం చిన్నారెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందించానని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని ఒకసారి0 మంత్రిగా పనిచేశానని చెప్పారు .గోపాల్ పెట్ మండలం లో పోలికేపాడు గ్రామం గుట్టల మధ్యన మార్కెట్ యార్డ్ శంకుస్థాపన ఎమ్మెల్యే మెగా రెడ్డి మార్కెట్ యార్డ్ నిర్మాణానికిమంత్రి తుమ్మల నాగేశ్వర్ రెడ్డితో శంకుస్థాపన చేయించారని ఆయన పేర్కొన్నారు గోపా ల్ పే ట్ మండల కేంద్రంలో ప్రభుత్వ స్థలం 76 ఎకరాలు ఉన్నదని మండలానికి అనుకూలంగా తన సొంత గ్రామం తిరుమలాపుర o ఉన్నదని వివిధ గ్రామాలు ఉన్నాయని గోపాల్ పెట్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ నిర్మిస్తే అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు. ఎన్నికల ముందు ఎమ్మెల్యే మెగా రెడ్డి గెలుపుకు పెద్దమందడి మండలంలో అనేక గ్రామాల్లో ప్రచారం చేశా నని గెలుపు కు కృషి చేశానని చిన్నారి రెడ్డి చెప్పారు . తెలంగాణ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ బీ ఎ సి కమిటీకి కే సీ వేణుగోపాల్ ఇన్చార్జిగా ఉన్నారని ఆ కమిటీలోనేను కూడా ఉన్నానని చిన్నారెడ్డి చెప్పారు . సీఎం రేవంత్ రెడ్డి తన.పై నమ్మకంతో బేగంపేట్ ప్రజాపాలన కార్యాలయం ప్రజల వినతి పత్రాలు స్వక రి o చు ట అప్ప గించారని చెప్పారు ప్రతి శుక్రవారం 8 వేల నుండి 12 వేల వరకు ప్రజలు. వస్తుంటారని వారితో. ఫిర్యాదులు స్వీకరించి అప్పటికప్పుడు సంబంధిత కలెక్టర్లతో అధికారులతో ఫోన్లో సంప్రదించి ప్రజల సమస్యలకు పరిష్కారం కావడానికి కృషి చేస్తున్నానని చిన్నారెడ్డి చెప్పారు. ఓపి క తో ప్రజల వినతి పత్రాల స్వీక రి స్తు.న్న నని ఆయన పేర్కొన్నారు .పార్లమెంట్ ఎన్నికల్లో డాక్టర్ మల్లు రవి గెలవడానికి వనపర్తి నియోజకవర్గ మొత్తం పర్యటించానని గెలుపుకు కృషి చేశానని ఆయన పేర్కొన్నారు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి ఇంటికి వెళ్లి రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని సీఎం రేవంత్ ముఖ్యమంత్రి ఆయాతారని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రచారంలో చేశానని ప్రజలను కోరానని చెప్పారు శ్రీమతి సోనియా గాంధీ పాదాభివందనం అసెంబ్లీ ఎన్నికలలో నాకు టికెట్ ఇవ్వడానికి నా యొక్క పేరును టికెట్ రావడానికి లిస్టులో టిక్ చేశారని చెప్పారు .ప్రస్తుత ఎమ్మెల్యే మెగా రెడ్డి సర్వే చేసిన బృందానికి గల్లీ నుంచి ఢిల్లీ వరకు డబ్బులు ఇచ్చి అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారని విమర్శించారు 46 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ కి సేవలందించానని ఇప్పుడు కూడా నా వ్యక్తిగత విషయంలో జోక్యం చేసుకోవద్దని నాకు అన్ని తెలుసునని అన్నారు ఎమ్మెల్యే కు ఒకటి చెబుతున్న నీ వెంబడి ఉన్న నాయకుల అభిప్రాయాలు తీసుకొని ఇతర నాయకుల అభివృద్ధికి అడ్డుపడితే సహించనని హెచ్చరించారు ఈ విలేకరుల సమావేశంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బి కృష్ణ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్ న్యాయవాది కిరణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

చిరకాల స్వప్నం నెరవేరిన వేళ మెదక్ మెడికల్ కాలేజీ మంజూరు చేస్తూ అనుమతులు రావడం శుభ పరిణామం శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు

– జిల్లాలోని యువత డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా తయారు కావాలి. మైనంపల్లి….

– వైద్యా కళాశాల అనుభవిజ్ఞులైన వైద్యాధికారులు పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్…..

 

– దీని వెనుక విశేష కృషి చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమాత్యులు దామోదర్ రాజనర్సింహ….

– జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మెడికల్ యంత్రాంగానికి ధన్యవాదాలు…..

– మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు…..

కొల్చారం, (మెదక్) నేటిధాత్రి :-

బుధవారం మెదక్ మెడికల్ కలశాల మంజూరి సందర్బంగా పీళ్ళికొటాలలో ఉన్న తాత్కాలిక మెడికల్ కళాశాల భవనాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తో కలిసి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పరిశీలించరు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం పక్కన నిర్మించనున్న శాశ్వత మెడికల్ కాలేజీ భవన నిర్మాణ స్థలాన్ని కలెక్టర్ రాహుల్ తో కలిసి ఎమ్మెల్యే రోహిత్ రావు జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏ బ్లాక్, సి బ్లాక్ భావనాలను, సమకూర్చిన, ఫర్నిచర్, పరికరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ మేము అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలలోనే మెడికల్ కాలేజీ మంజూరు అయిందన్నారు. జిల్లా ప్రజల ఆకాంక్ష నెరవేరిన వేళ వైద్య విద్యకు న్యాయం చేసిన వేళ జిల్లాలో యువత ఇంజనీర్లుగా డాక్టర్లుగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా తయారయ్యే వేల ఎన్నో అవాంతరాల తర్వాత ఎట్టకేలకు మెదక్ మెడికల్ కాలేజ్ మంజూరి చేసినందుకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కు జిల్లా కలెక్టర్ కు, అధికారులకు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు కృతజ్ఞతలు తెలిపారు.
నర్సింగ్ కళాశాల,మెడికల్ కళాశాల ఒకే ప్రాంగణంలో ఉండే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ కు ఎమ్మెల్యే సూచించారు.
జిల్లా అభివృద్ధికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అనంతరం పీళ్ళికొటాలలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన మెడికల్ కళాశాల భూమిని
శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ పరిశీలించి భవన నిర్మాణాలకు
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకున్నట్లు వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లా పునర్విభజనలో భాగంగా మెదక్ ప్రత్యేక జిల్లా అయినా కూడా అంత అభివృద్ధి చెందలేదని జిల్లా అభివృద్ధిలో విద్యా ,వైద్యం సౌకర్యాలు మెరుగు ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పారు వైద్య కళాశాల మంజూరు కావడం దీని వెనక విశేష కృషి చేసిన జిల్లా మంత్రివర్యులు, శాసనసభ్యులు, హెల్త్ సెక్రెటరీ , ధన్యవాదాలు తెలిపారు. అనుభవజ్ఞులైన వైద్యాధికారులు ఉండడం స్థానికంగా ఉండి పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలని వైద్య కళాశాల అభివృద్ధికి కృషి చేస్తున్న మెడికల్ యంత్రాంగానికి అభినందనలు తెలిపారు.
అంతకుముందు మెదక్ పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు రాందాస్ చౌరస్తాలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి,మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చిత్ర పటాలకు పాలాభిషేకం చేసి టపాసులు కాల్చి మిఠాయిలు తినిపించకుని సంబరాలు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రవీందర్, ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ శివ దయాల్, తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్
వార్డ్ కౌన్సిలర్లు, వివిధ ప్రభుత్వ అధికారులు , మెడికల్ కళాశాల సిబ్బంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు రెండో రోజు‌ వైద్య పరీక్షలు

 

Bhatti Vikramark

CLP leader Bhatti Vikramark second day health update :

కేతేపల్లి పాదయాత్ర శిబిరం వద్ద కొనసాగుతున్న ట్రీట్మెంట్

వడదెబ్బ కారణంగా ఇంకా తగ్గని జ్వరము, నీరసం.

డిహైడ్రేషన్ కావడంతో సెలైన్స్ పెట్టిన వైద్యులు

భట్టికి కేఎల్ ఆర్ పరామర్శ

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారు వడదెబ్బ కారణంగా అస్వస్థతకు గురవడంతో రెండో రోజు బుధవారం నాడు సూర్యాపేటకు చెందిన డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కేతేపల్లి పాదయాత్ర శిబిరం వద్ద వైద్యలు చికిత్స అందిస్తున్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో తీవ్ర అస్వస్థతకు గురైన మల్లు భట్టివిక్రమార్క గారిని సూర్యాపేట జిల్లా కేతేపల్లి గ్రామ పాదయాత్ర శిబిరం వద్ద
సీనియర్ కాంగ్రెస్ నేతలు కేఎల్‌ఆర్,ప్రేమ్ సాగర్ రావు పరామర్శించారు.

KLR focus on Malkajigiri : మల్కాజిగిరిపై కేఎల్ఆర్ దృష్టి… మంత్రులపై ఫోకస్‌!

 

కాంగ్రెస్ పార్టీ కీలక నేత కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్)గా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రాంత వాసులకి అత్యంత సుపరిచితులైన మన డైనమిక్ లీడర్. ప్ర‌స్తుతం ఆయ‌న‌ హై కమాండ్ ఆదేశాలతో ఎలక్షన్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఏక కాలంలో కేసీఆర్ క్యాబినెట్‌లోని ఇద్ద‌రు మంత్రులు, ఒక మాజీ మంత్రి నియోజకవర్గాలపై గురి పెట్టారు. ఈ మూడింట్లో ఏదొక నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయన బరిలోకి దిగుతారని కాంగ్రెస్‌లో ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి వలస వెళ్లిన సబితా ఇంద్రా రెడ్డి ప్రస్తుతం మహేశ్వరం ప్రాంతంలో సెగ్మెంట్‌లోని ఆమె ప‌నితీరు, లోటు పాట్లపై కేఎల్ఆర్ దృష్టి సారించారు. మంత్రిగా కూడా అధికారం వెలగబెడుతోన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు చేసిందేమీ లేదని తెలుస్తోంది. అలాగే, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి మరో మంత్రి మల్లారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంపై కూడా ఫోకస్ చేస్తున్నారు. మేడ్చల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఆయన రేయింబవళ్లూ సీఎం కేసీఆర్, కేటీఆర్ భజనలో తరిస్తుంటారు. జనానికి చేసిన మేలు మాత్రం అంతంతమాత్రమే. రానున్న ఎన్నికల్లో కేఎల్ఆర్‌ను మేడ్చల్ నుంచి కూడా అధిష్టానం బరిలో దింపవచ్చట.

ఇక తాండూరులో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి లేదా సిట్టింగ్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని కిచ్చన్నగారి లక్ష్మారెట్టి ఢీకొట్టే అవకాశం ఉంది. మాజీ మంత్రిపై ఉన్న వ్య‌తిరేకత‌తో గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి పైలెట్ రోహిత్ రెడ్డిని ప్ర‌జ‌లు గెలిపించారు. అయితే, ఆప‌రేష‌న్ ఆకర్ష్‌లో భాగంగా రోహిత్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడ‌డంతో పార్టీ క్యాడెర్‌, ప్ర‌జ‌లు ఆగ్ర‌హంగా ఉన్నారు. ఒక‌వేళ కేఎల్ఆర్ ఇక్క‌డ నుంచి బ‌రిలోకి దిగితే కేసీఆర్ టీమ్‌లోని బలమైన నేతగా ఉన్న మహేందర్ రెడ్డికి క‌ష్ట‌కాలం త‌ప్ప‌దని వినికిడి. మొత్తానికి ఈ మూడు స్థానాల్లో కేఎల్ఆర్ ఎక్క‌డ నుంచి బ‌రిలోకి దిగిన‌ కాంగ్రెస్‌కు ఒక సీటు కన్ ఫర్మ్ అని తెలుస్తోంది.

గ్రీన్ ఫీల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి

మహబూబాబాద్, నేటిధాత్రి: గ్రీన్ ఫీల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని దిశ చైర్మన్ మాలోత్ కవిత ఆదేశించారు. గురువారం స్థానిక ఐ.ఎం.ఎ. హాలులో జిల్లా కలెక్టర్ శశాంక అధ్యక్షతన జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం ప్రజాప్రతినిధుల తోనూ అధికారులతోనూ నిర్వహించారు.మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు, దిశ కమిటీ చైర్ పర్సన్ మాలోత్ కవిత అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సంబంధిత అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా 37 అంశాలపై అంశం వారీగా వైద్యం, జాతీయ ఆరోగ్య మిషన్, ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన, సమగ్ర శిశు అభివృద్ధి పథకం, మధ్యాహ్న భోజనం, ఉపాధి హామి, పెన్షన్ లు, ప్రధాన మంత్రి సడక్ యోజన, జాతీయ రహదారులు విద్యుత్ పథకాలపై సమీక్షించారు.

ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కుమారి ఆంగోతు బిందు, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, డోర్నకల్ శాసన సభ్యులు డి.ఎస్. రెడ్యా నాయక్, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఎంపిపి బయ్యారం చేపురి మౌనిక, చిన గూడూరు పద్మ వల్లూరి,ధంతలపల్లి ఉమ వలదారి, డోర్నకల్ దరంసోతు బాలు, గంగారాం సువర్ణ పాక సరోజన, గార్ల ఎం. శివాజీ, గూడూరు బాణోతు సుజాత, కెసముద్రం వి. చంద్ర మోహన్, కొత్తగూడ బనోతు విజయ, కురవి గుగులోతు పద్మావతి, మహబూబాబాద్ భూక్యా మౌనిక, మరిపెడ గుగులోత్ అరుణ, టెకుల సుశీల, నెల్లికుడురు ఎర్రబెల్లి మాధవి, పెద్ద వంగర ఈదూరి రాజేశ్వరి, తొర్రూరు తూర్పాటి చిన అంజయ్య, మునిసిపల్ చైర్మన్ రామచంద్రయ్య, మహబూబాబాద్ పాల్వాయి రామ్ మోహన్ రెడ్డి, డోర్నకల్ వీరన్న, మరిపెడ సింధు కుమారి, నామినేటెడ్ మెంబర్ లు సర్పంచ్ లు బట్టు శ్రీనివాస్ నవీన్, సుష్మ గౌడ్, అజ్మీరా రజిత, ఆనంద్, మమత, ఎన్. జి. ఓ. ప్రతినిధులు పివి. ప్రసాద్, పి. శ్రీనివాస రెడ్డి జడ్పీటిసి లు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఆదర్శ రైతులను సన్మానించిన మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు

జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే డా.తాటికొండ రాజయ్య, ఆదేశానుసారం జనగామ జిల్లా ఘనపూర్ స్టేషన్ వ్యవసాయ మార్కెట్ ఆవరణలో బుధవారం మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు, ఆధ్వర్యంలో పలువురు ఆదర్శ రైతులను శాలువా కప్పి సన్మానించి రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తదనంతరం కార్యక్రమాన్ని బట్టి గుజ్జరి రాజు, మాట్లాడుతూ రైతు వ్యతిరేక ప్రభుత్వాలపై రైతాంగం ఉద్యమించాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఉద్యమ కేరటాలని మనకు ఉద్యమాలు కొత్తేమీ కాదని కేంద్ర ప్రభుత్వం పై ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. అదే విధముగా రైతుల పోరాటం ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను రద్దు చేసిందన్నారు. ఉడకబెట్టిన బియ్యాన్ని కొనం అనే సాకుతో రైతులను ఆయన చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర రైతులు పండించిన ప్రతి పంటలను రైతులు అమ్ముకునే విధంగా చట్టాలు చేసి, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసే స్వేచ్ఛ ఇవ్వాలన్నారు.

అంతేకాకుండా వ్యవసాయ రంగాన్ని నమ్ముకున్న రైతాంగం కష్టాలు వారు ఎదురు కొంటున్న నష్టాలన్ని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్, రైతు సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని గుర్తు చేశారు.అంతేకాకుండా దేశానికి అన్నం పెట్టే అన్నదాతలను ప్రభుత్వాలు ప్రోత్సహించి, వారికి అండగా నిలువాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి జీవన్ కుమార్, స్టేషన్ ఘనపూర్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మాచర్ల గణేష్, మార్కెట్ డైరెక్టర్లు బత్తుల రాజన్ బాబు, పెంతల రాజ్ కుమార్, చల్లారపు శ్యామ్ సుందర్, చిగురు సరిత-ఆంజనేయులు, సుప్రియ, పిఏసిఎస్ డైరెక్టర్ తోట సత్యం, శివునిపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు బాలరాజు, ఏసుబాబు మార్కెట్ సిబ్బంది, రైతులు, హామలీలు పాల్గొన్నారు.

ఓట్లుంటేనే ఓదార్పులా” “నేటిధాత్రి” కథనానికి “కడియం” స్పందన

*గత ఏడాది తల్లి, పది రోజుల క్రితం తండ్రి…*

*తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయి అనాధలుగా మిగిలిన పసిపిల్లలు*

*అన్ని రకాలుగా పిల్లలను ఆదుకుంటామని కడియం ప్రకటన*

*ఐనవోలు* గ్రామానికి చెందిన చిన్నారులు *ప్రణయ్, నందులపై “నేటిధాత్రి” దినపత్రికలో వచ్చిన కథనానికి తెలంగాణ మాజీ ఉప  ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ “కడియం శ్రీహరి” స్పందించారు*. అనాధలైన పిల్లలను ఆదుకుంటామని చెప్పారు. గత ఏడాది జూన్ లో కన్న తల్లి చనిపోయింది. గత పది రోజుల క్రితం తండ్రి చనిపోవడంతో పిల్లలు అనాధలయ్యారు. జరిగిన *సంఘటన తెలియగానే నేటిధాత్రిలో ఆ పిల్లలుపై ఈ రోజు  ‘ఓట్లుంటేనే ఓదార్పులా” అనే కథనం ప్రచురించడం జరిగింది. ఆ వార్తను చూసిన కడియం శ్రీహరి ఆ పిల్లలకు సంబంధించి అన్ని రకాల సహాయసహారాలు అందించేందుకు ముందుకొచ్చి తన మానవత్వాన్ని చాటుకున్నారు.* ఆ పిల్లల విషయంలో మరింత మంది మానవతా హృదయులు ముందుకొస్తే వారి జీవితం తెగిన గాలిపటం కాకుండా వుంటుంది. *నిరుపేదలైన దళిత పిల్లలను ఆదుకోవాల్సిందిగా “నేటిధాత్రి” మనవి.

26న ఇల్లందులో జరుగు నిర్మాణ జనరల్ బాడీ ని జయప్రదం చేయండి; కే సారంగపాణి

(భద్రాద్రికొత్తగూడెం జిల్లా)గుండాల,నేటిధాత్రి: కార్మిక హక్కులను హరించే విధంగా దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని “భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ ఎఫ్ టి యు) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి కే సారంగపాణి పిలుపునిచ్చారు. బుధవారం మణుగూరులో ఐ ఎఫ్ టి యు ముఖ్య కార్యకర్తలతో మల్లి కంటి రాము అధ్యక్షతన జరిగిన సమావేశం లో సారంగపాణి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నుండి కార్మిక హక్కులను చట్టాలను రద్దు చేయడానికి కుట్రపూరితంగా ప్రయత్నిస్తోందని అందులో భాగంగానే గతంలో పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లు గా కుదించి. కార్మిక వర్గ హక్కులను హరించి కార్పొరేట్ కంపెనీలకు బహుళజాతి సంస్థలకు బడా పెట్టుబడిదారులకు ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, సింగరేణి, రైల్వే, విద్యుత్ , బ్యాంకులు తదితర ప్రభుత్వ రంగ సంస్థలను వారికి అప్పగించి ప్రైవేట్ పరం చేయుటకు సిద్ధమైందని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేసే ఆలోచనలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఈపీఎఫ్ , ఇతర బెనిఫిట్స్ అమలు చేయాలని , అసంఘటిత రంగంలోని హమాలి, మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

గ్రామపంచాయతీ లో పనిచేసే కార్మికులకు పిఆర్సిప్రకారం వేతనాలు చెల్లించాలని, గ్రామ పంచాయతీలలో మల్టీ పర్పస్ విధానాన్ని తొలగించాలని అన్నారు. కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, భవిష్యత్ పోరాటాలను కర్తవ్యాలను రూపొందించుకునేoదుకు ఈనెల 26 న ఇల్లందులో జరిగే భారత కార్మిక సంఘాల సమాఖ్య( ఐ ఎఫ్ టి యు) జిల్లా నిర్మాణ జనరల్ బాడికి కార్మికులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి య జిల్లా నాయకులు కందగట్ల సురేందర్ , మోత్కూరి మల్లికార్జున్, మణుగూరు ఏరియా నాయకులు మలికంటి రాము, డి విక్రమ్ , బట్టా సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా గణిత దినోత్సవ వేడుకలు

నెక్కొండ, నేటిధాత్రి:
నెక్కొండ మండలం అప్పల రావు పేట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో బుధవారం జాతీయ గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బూరుగుపల్లి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గణిత శాస్త్ర ఉపాధ్యాయులు రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో విద్యార్థులను బృందాలుగా విభజించి గణితశాస్త్రంలో క్విజ్ పోటీ నిర్వహించారు . ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.

బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమములో ప్రధానోపాధ్యాయులు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చు అనడానికి రామానుజన్ జీవితమే నిదర్శనం అన్నారు. తొలి దశలో ఆశించిన ఫలితాలు రాకున్నా విద్యార్థులు నిరుత్సాహం చెందకుండా ముందుకు సాగితే అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రవీంద్రనాథ్ సౌభాగ్య లక్ష్మి , యాకయ్య భూలక్ష్మి ,యాకూబ్ పాషా,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

హెల్మెట్స్ బ్యాగ్ లు టీ షర్ట్ లు పంపిణీ

నేటిధాత్రి కొండపాక : కొండపాక మండలం కుకునూరుపల్లి గ్రామంలో గత 15 రోజుల నుండి నెక్, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి ఆధ్వర్యంలో ఎలక్ట్రీషియన్ లకు భవన నిర్మాణ కార్మికులకు శిక్షణ ఇచ్చి హెల్మెట్స్ బ్యాగ్ లు టీ షర్ట్ లు పంపిణీ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అథితి గా కుకునూరుపల్లి సర్పంచ్ పోల్కంపల్లి జయంతి నరేందర్ హాజరై మాట్లాడుతూ ఇట్టి శిక్షణ కాలంలో రోజుకు 300 రూపాయలు చొప్పున స్టైపండ్, మధ్యాహ్న భోజనం ,హెల్మెట్స్ బ్యాగ్ ఫైండ్ అవుట్ టీషర్ట్ , ట్రైనింగ్ ముగిసిన తర్వాత సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు ఇట్టి కార్యక్రమాన్ని లేబర్ కార్డు ఉన్నవారు కుకునూరుపల్లి పరిసర గ్రామ ప్రాంతాల వాళ్ళు వినియోగించుకోవాల్సిన కోరుచున్నాము అన్నారు.

కార్యక్రమంలో లేబర్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్, సెంటర్ ఇన్చార్జ్ మరియు స్టాఫ్ మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది

జయముఖీలో ముగిసిన డిజైనింగ్ సోలార్ సిస్టమ్ వర్క్ షాప్

మండలంలోని ముగ్ధుము పురం గ్రామంలోని జయముఖీ ఇంజనీరింగ్ అటానమస్ కళాశాలలో రెండు రోజుల పాటు జరిగే ట్రైనింగ్ ప్రోగ్రాం “డిజైనింగ్ సోలార్ సిస్టమ్ వర్క్ షాప్”మంగళవారం రోజున కళాశాల ఆవరణలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగం& ఐ.ఈ.ఈ.ఈ పెస్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం స్. ఏ.ఈ ఇండియా మరియు గ్రీన్ వేయిన్ ఎనర్జీ టెక్నాలజీస్ సంయుక్త ఆద్వర్యంలో విజయవంతంగా ముగిసింది ముఖ్య అతిథి కళాశాల ప్రిన్సిపాల్ వాగ్దేవి గ్రూప్స్ ప్రెసిడెంట్, ట్రెజరీ ,విభాగ అధిపథులు ఈ కార్యక్రమన్ని ప్రారంభం చేశారు.

ముఖ్య అతిధిగా పాల్గొన్న పురుషోత్తం చారీ, గ్రీన్ వేయిన్ ఎనర్జీ టెక్నాలజీస్ మానేజర్ మాట్లాడుతూ రేనేవాబుల్ విద్యుత్ ఉత్పత్తి, నియంత్రణ పై ప్రయోగాత్మకంగా విద్యార్థులచే అవగాహన కల్పించారు.కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్. యం. లోకనదరావు మాట్లాడుతూ విద్యార్థులం దరూ రెండు రోజులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు అభినం దించారు.వాగ్దేవి కళాశాలల ప్రెసిడెంట్ శ్రీ సీ.హెచ్ నరసింహ రెడ్డి మరియు ట్రెజరీ జీ.శంకర్ రెడ్డి ,ఈ శిక్షణ కార్యక్రమం లో పాల్గొన్న వారికి సర్టిఫికేట్ ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం లోకనాధ్ రావు ,వాగ్దేవి కళాశాలల ప్రెసిడెంట్ శ్రీ సీ.హెచ్ నరసింహ రెడ్డి , ట్రెజరీ శ్రీ.జీ.శంకర్ రెడ్డి ,డీన్ అకడమిక్ హమీద్ పాషా.,వైస్ ప్రిన్సిపాల్ డా.పీ.శ్రీనివాస రావు, ఈ.ఈ.ఈ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ రజనీ కుమార్, మెకానికల్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ యం. జవహర్ మరియు ప్రోగ్రాం కో ఆర్డనేటర్స్ కే. శ్రీదేవి మరియు సీ.హెచ్ జీవన్ రెడ్డి, ప్రొఫెసర్ రంజిత్ ,కళాశాల వివిధ విభాగాల అధిపతులు మరియు అధ్యాపకులు , దేశంలోని వివిధ రాష్ట్రాల కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

త్వరలోనే లబ్దిదారులకు అందిస్తాం , కేటీఆర్

పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్

 

హైదరాబాద్,నేటిదాత్రి: అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను త్వరలోనే పూర్తి చేసి లబ్దీదారులకు అందిస్తామని రాష్ట్ర పురపాలక,ఐటి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.
బుధవారం బెడ్ రూమ్ ఇళ్ల కార్యక్రమం పైన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం మంత్రులు కేటిఆర్,వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశానికి నగర మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్ లతో పాటు ఉన్నతాధికారులు మరియు హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులు, వర్కింగ్ ఏజెన్సీలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ డబుల్ బెడ్ రూ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అన్నారు. హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల ఇప్పటికే 80 శాతానికి పైగా నిర్మాణాలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. కొన్నిచోట్ల చేయడం పూర్తి చేశామని మంత్రి తెలిపారు. త్వరలోనే మిగిలిన నిర్మాణాలను పూర్తి చేసిన లబ్దిదారులకు అందించే ప్రయత్నం చేస్తామని ఆయన హా చేయడానికి ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు పూర్తి శ్రద్ధ వహించి ముందకుపోవాలని సూచించారు.

అవగాహనతోనే కట్టడి సాధ్యం

వరంగల్,నేటిధాత్రి:అవగాహనతోనే కరోనాను అంతం చేసేందుకు సాధ్యమౌతుందని పరికిపండ్ల అశోక్ అన్నారు.ఆదివారం కరోనా కట్టడికి డాక్టర్ పరికిపండ్ల అశోక్ చేపట్టిన ప్రజా చైతన్య బైక్ యాత్ర 25 వ రోజు, నాల్గవ జిల్లా వరంగల్ అర్బన్ లో భాగంగా వరంగల్ మహానగరం 11 వ డివిజన్ క్రిస్టియన్ కాలని గాంధీ నగర్ లో కరోనా పై అవగాహన సదస్సు మరియు వ్యాధి నిరోధకశక్తిని పెంపొందించే ఉచిత హోమియోపతి మందుల పంపిణీ చేశారు. ప్రజలు, పారిశుధ్య కార్మికులు సుమారు 1200 మంది ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచు కున్నారు.ఈ సందర్భంగా డా అశోక్ మాట్లాడుతూ ప్రజలు సామాజిక దూరాన్ని పాటిస్తూ,మాస్కులు ధరించి ప్రతి రెండు గంటలకు ఒకసారి సబ్బుతో చేతులు శుభ్రపరచి జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి,నగర కార్యదర్శి – భశీర్, బుస్సా రవీందర్, టిఆర్ఎస్ నాయకులు మరుపట్ల సాయికుమార్, మెడిది అశోక్,అశోక్,గుండె భద్రి, గన్నపు రమేష్,దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ అజాంజాహి మిల్ గ్రౌండ్ లో అగ్ని ప్రమాదం

ఘటనాస్థలికి చేరుకుని పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

 

నేటిధాత్రి డేస్క్:అజాంజాహి మిల్ గ్రౌండ్ లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మార్కెట్ లో అగ్నిప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న స్థానిక శాసన సభ్యులు నన్నపునేని నరేందర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
ఘటనపై జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంది హనుమంతుతో ఫోన్ లో మాట్లాడి ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు.. అగ్నిమాపక అధికారులు, సిబ్బందితో మరియు ఎలక్ట్రిక్ సిబ్బందితో ఎమ్మెల్యే మాట్లాడారు.. మంటలు ఎలా వ్యాపించాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు.. మంటలు అదుపులోకి వచ్చాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

అప్రమత్తంగా ఉండాలని,ఏమరపాటు వద్దని ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతం అయినందున పూర్తి స్థాయిలో నిర్ధారణ జరిగే వరకు సహాయక చర్యలు కొనసాగించాలని ఎమ్మెల్యే అదికారులకు సూచించారు…స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తూ అదికారులకు సూచనలు చేసారు..

ఈ సందర్బంగా ఎమ్మెల్యేతో పాటు స్థానిక కార్పోరేటర్ సోమిశెట్టి శ్రీలత ప్రవీణ్,నాయకులు,స్థానికులు ఉన్నారు.

కర్ఫ్యూ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు

పోలీస్ కమిషనర్ డా రవీందర్
కరోనా వ్యాప్తిని ఆడ్డుకోవడానికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీసు కమిషనర్ విశ్వనాథ్ రవీందర్ హెచ్చరించారు.

గురువారం లాక్ డౌన్ నేపథ్యంలో రాత్రి కర్ఫ్య్ సమయంలో యంజియం పోలీస్ చేకింగ్ పాయింట్ వద్ద అనవసరంగా రోడ్ల మీదకు వస్తున్న వాహనాదారులపై పోలీస్ కమిషనర్ అగ్రహం వ్యక్తం చేయడంతో పాటు రోడ్ల మీదకు వచ్చిన వాహనాలను తక్షణమే సీజ్ చేసి కేసులను నమోదు చేయాల్సిందిగా కమిషనర్ అధికారులను అధేశించారు.

 

 

ఎర్రబెల్లి సొంత గ్రామంలో ధాన్యం తగులబెట్టిన రైతులు

కొనుగోలులో జాప్యం,కాంటాలో అక్రమాలే కారణం

 

వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో నిర్వహిస్తున్న ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రంలో బుధవారం రైతులు వరి ధాన్యాన్ని తగలబెట్టారు. తమ ఇబ్బందులను సంబంధిత ఆఫీసర్లు ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గత నెల రోజుల నుంచి నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు 500 మందికి టోకెన్ ఇప్పటికీ 120 మందికి మాత్రమే కాంటాలు నిర్వహించారని ఇక్కడ బస్తా కు నలభై రెండు కేజీలు తూకం నిర్వహించి తామె వాహనాలలో తమకు కేటాయించిన మిల్లు వద్దకు తీసుకెళితే తీరా అక్కడ మిల్లర్లు నలభై నాలుగు కేజీలు ఉంటేనే దిగుమతి చేసుకుంటామని తేల్చి చెబుతున్నారు అని ఆరోపించారు ఈ విషయమై స్థానిక రెవెన్యూ ఆఫీసర్లకు చెప్పిన ఫలితం లేకుండా ఉందని ఆరోపించారు మేము మిల్లర్ల తో మాట్లాడదాం చేస్తాం అని చెబుతున్నారే తప్ప ఏమాత్రం పట్టించుకోవడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ
ధాన్యం తగుల బెట్టి నిరసన వ్యక్తం చేసిన రైతులు,

స్థానిక ఆఫీసర్లు జిల్లా ఆఫీసర్లు వెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని అని రైతులు దేవేందర్ రావు సుధాకర్ ధరావత్ బాలు ఆడెపు విజయ్ నరిశెట్టి రాజు భానోత్ ఎరుక చింతకుంట్ల రాజు సుమారు 40 మంది రైతులు వేడుకుంటున్నారు

కమర్షియల్ నిర్మాణాల్లో ‘గోల్ మాల్’

*నగరంలో 60 శాతం పైగా అక్రమ కట్టడాలే*
*అనుమతుల్లో జిడబ్ల్యుఎంసి అధికారుల చేతివాటం*
*ప్లానింగ్ కు సంబంధం లేకుండా నిర్మాణాలు*
*అక్రమ కట్టడాల్లో ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లే అధికం*
*తిమ్మిని బమ్మి చేసి ప్రభుత్వానికి పంగనామం పెడుతున్న అధికారులు* *కళ్యాణ లక్ష్మి ఘటనలో అదుపులోకి రాని పరిస్థితులు*
*కొనసాగుతున్న అధికారుల ప్రయత్నాలు*

నేటి ధాత్రి డెస్క్:నగరాన్ని అభివృద్ధి చేయడంలో నిధుల ప్రాముఖ్యత ఏ స్థాయిలో ఉంటుందో అధికారుల పనితీరు కూడా అంతకు మించి ఉన్నప్పుడే నిజమైన అభివృద్ధి సార్యమౌతుండి. అధికారులు నిర్వహిస్తు విధులకు ప్రభుత్వం చెల్లిస్తున్న జీతాలను మించి ఆరించి అవినీతికి పాల్పడితే నగరం అభివృద్ధి కాగితాలకే తప్ప ప్రత్యక్షంగా జరగడం అసాధ్యమౌతుంది. ఇదే పరిస్థితి ఇప్పుడు వరంగల్ నగరాన్ని మెంటాడుతుం ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి మొదలుకొని ప్రభుత్వ పెద్దల వరకు. రానున్న రోజుల్లో వరంగల్‌కు పెద్దసంఖ్యలో పరిశ్రమలు అభివృద్ధి సంస్థలు తరలో అమాశం ఉందని గంటాపథంగా చెబుతున్నప్పటికి ఆ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలు, చర్యలు తీసుకోలేక పోతున్నారు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.గ్రేటర్ వరంగల్ మున్సిపల్ శాఖ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కొన్ని శాఖలకు సంబంధించిన అధికారులు కేవలం అక్రమ మార్గంలో ధనార్జనే లక్ష్యంగా అక్రమాలకు పాల్పడుతూ నగర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారు.

 

*నగరంలో 60 శాతం పైగా అక్రమ కట్టడాలు*

గ్రేటర్ వరంగల్ నగరంలో ఇప్పటి వరకు 3 లక్షల పైగా నిర్మాణాలు ఉండగా అందులో 2 లక్షల నిర్మాణాలు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణం అయినదని నను ఉత్పల భవిష్యత్తును కాక్షించే కార్పోరేషన్ పెద్దలే చెబుతున్నారు. అంటే నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు జారీ చేసే విషయంలో కీలకంగా పని చేసే అధికారులు ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నారో అర్ధమౌతున్నది. ఈ అక్రమ నిర్మాణాలు నగర అభివృద్ధికి పెను ప్రమాదంగా మారుతున్నాయి. కేవలం తమ స్వార్థ కొరకు అక్రమ నిర్మాణాల మీద చర్యలు తీసుకోకుండా తమ జేబులు నింపుకోవడానికి దిగజారుతున్న అధికారుల వలన వేల కోట్ల రూపాయల ప్రభుత్వం నష్టపోతున్నది. అంతేకాకుండా పన్నుల ఆదాయాన్ని కోల్పోయి నగర అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగక కుంటుపడుతుంది.ఈ విషయం ప్రజలకంటే ప్రజా ప్రతినిధుల కంటే పూర్తిస్థాయిలో అవగాహన ఉన్న అధికారులే ఈ అక్రమాలకు పాల్పడుతుండడం గమనార్హం

 

*ప్లానింగ్ కు సంబంధం లేని కట్టడాలు*

నగరంలో ప్రధానంగా కమర్షియల్ కట్టడాలకు సంబంధించి ఎలాంటి మునిసిపల్ నిబంధలనలు పాటించకుండా కట్టడాలు జరుగుతున్నారు. కేవలం నిర్మాణానికి సంబంధించిన మరుతలు రావడానికి కాగితాలను ప్రభుత్వ నిబంధనలకు అణుగుణంగా తయారు చేయిస్తూ కట్టడాలు మాత్రం యజమానులు తమకు లాభదాయకంగా ఉండే విధంగా నిర్మించుకుంటున్నారు.

*పూర్తి కథనం ఈ రోజు మీ నేటిధాత్రిలో*

 

 

కళ్యాణలక్ష్మిలో చెలరేగుతున్న మంటలు అదుపుచేసేందుకు రంగంలోకి స్కై లిఫ్ట్

వరంగల్ అర్బన్(హన్మకొండ),నేటిధాత్రి:జిల్లాలో ప్రముఖ వస్త్ర దుకాణం కళ్యాణలక్ష్మిలో ఆదివారం మొదలైన అగ్నిప్రమాదం వలన ఏర్పడిన పొగ,మంటలు ఇంకా అదుపులోకి రాలేదు.ఆదివారమే ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకు రావడానికి అగ్నిమాపక సిబ్బంది,గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పోరేషన్ కు సంబంధించిన డిఆర్ ఏఫ్ రంగంలోకి దిగి తీవ్రంగా ప్రయత్నించినప్పటికి అగ్నిప్రమాదం చోటుచేసుకున్న నాలుగో ఫ్లోర్ కు వెళ్ళడానికి ఎలాంటి అత్యవసర దారులు గాని లేకపోవడం పొగలు దట్టంగా రావడంతో బిల్డింగ్ పై కప్పుకు రంద్రాలు చేసి అదుపు చేయడానికి ప్రయత్నం చేసినప్పటికి ఫలితం రాలేదు.దీంతో ఈ రోజు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు హైదరాబాద్ నుండి అగ్నిమాపక శాఖ అధికారులు స్కై లిఫ్ట్ రప్పించి ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.ప్రమాదం సంభవించి రోజు గడిచిన క్రమంలో మంటలు అన్ని ఫ్లోర్లకు వ్యాపించి దట్టమైన పొగ, అగ్ని ఎగిసిపడుతుంది.

 


 

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version