గ్రీన్ ఫీల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి

గ్రీన్ ఫీల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి

మహబూబాబాద్, నేటిధాత్రి: గ్రీన్ ఫీల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని దిశ చైర్మన్ మాలోత్ కవిత ఆదేశించారు. గురువారం స్థానిక ఐ.ఎం.ఎ. హాలులో జిల్లా కలెక్టర్ శశాంక అధ్యక్షతన జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం ప్రజాప్రతినిధుల తోనూ అధికారులతోనూ నిర్వహించారు.మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు, దిశ కమిటీ చైర్ పర్సన్ మాలోత్ కవిత అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సంబంధిత అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా 37 అంశాలపై అంశం వారీగా వైద్యం, జాతీయ ఆరోగ్య మిషన్, ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన, సమగ్ర శిశు అభివృద్ధి పథకం, మధ్యాహ్న భోజనం, ఉపాధి హామి, పెన్షన్ లు, ప్రధాన మంత్రి సడక్ యోజన, జాతీయ రహదారులు విద్యుత్ పథకాలపై సమీక్షించారు.

ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కుమారి ఆంగోతు బిందు, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, డోర్నకల్ శాసన సభ్యులు డి.ఎస్. రెడ్యా నాయక్, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఎంపిపి బయ్యారం చేపురి మౌనిక, చిన గూడూరు పద్మ వల్లూరి,ధంతలపల్లి ఉమ వలదారి, డోర్నకల్ దరంసోతు బాలు, గంగారాం సువర్ణ పాక సరోజన, గార్ల ఎం. శివాజీ, గూడూరు బాణోతు సుజాత, కెసముద్రం వి. చంద్ర మోహన్, కొత్తగూడ బనోతు విజయ, కురవి గుగులోతు పద్మావతి, మహబూబాబాద్ భూక్యా మౌనిక, మరిపెడ గుగులోత్ అరుణ, టెకుల సుశీల, నెల్లికుడురు ఎర్రబెల్లి మాధవి, పెద్ద వంగర ఈదూరి రాజేశ్వరి, తొర్రూరు తూర్పాటి చిన అంజయ్య, మునిసిపల్ చైర్మన్ రామచంద్రయ్య, మహబూబాబాద్ పాల్వాయి రామ్ మోహన్ రెడ్డి, డోర్నకల్ వీరన్న, మరిపెడ సింధు కుమారి, నామినేటెడ్ మెంబర్ లు సర్పంచ్ లు బట్టు శ్రీనివాస్ నవీన్, సుష్మ గౌడ్, అజ్మీరా రజిత, ఆనంద్, మమత, ఎన్. జి. ఓ. ప్రతినిధులు పివి. ప్రసాద్, పి. శ్రీనివాస రెడ్డి జడ్పీటిసి లు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version