సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన.

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ లో వానాకాలం పంటల సాగు కోసం రైతుభరోసా నగదు బదిలీ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు పండుగ’ పేరుతో సంబరాలు నిర్వహిస్తున్న సందర్భంగా భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు విస్లావత్ దేవన్ అధ్యక్షతన రైతు భరోసా సంబరాలు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభి శేఖం చేశారు. అనంతరం ఎమ్మెల్యే జీఎస్సార్ మాట్లాడుతూ ఇచ్చినమాట ప్రకారం 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల నగదు బదిలీ చేయడం రాష్ట్ర చరిత్రలోనే అరుదైన రికార్డు అని, ఇప్పటి వరకు కోటి 49 లక్షల 39 వేల 111 ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ ప్రభుత్వానిది అని ఎమ్మెల్యే జీఎస్సార్ అన్నారు. ఎలాంటి పరిమితులు లేకుండా సాగులో ఉన్న ప్రతి ఎకరానికీ పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా రైతు సంక్షేమం విషయంలో రాజీపడకుండా పెట్టుబడి సాయం అందించారంటూ సీఎం రేవంత్‌ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. రుణమాఫీ పథకాన్ని కూడా ఇలాగే 2024 ఆగస్టు 15 లోగా పూర్తిచేశామని చెప్పారు. గత ప్రభుత్వం ఎకరానికి 5 వేలు చొప్పున ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి 6 వేల చొప్పున సంవత్సరానికి 12 వేలు చొప్పున రైతులకు అందించడం జరిగింది. కేంద్రం కొనుగోలు చేయలేని పంట ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దేవన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకర రామచంద్రయ్య బుర్ర కొమురయ్య పిప్పాల రాజేందర్ దాట్ల శ్రీనివాస్ ముంజల రవీందర్ అంబాల శ్రీను తోట రంజిత్ పద్మ కోమల కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

త్వరలోనే సిరిసిల్ల లో పద్మశాలి భవన్ నిర్మాణం పూర్తి.

త్వరలోనే సిరిసిల్ల లో పద్మశాలి భవన్ నిర్మాణం పూర్తి

హైదారాబాద్ లోని చేనేత భవన్ లొ ప్రత్యేక సమావేశం

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణంలో పద్మశాలి భవన్, మార్కండేయ ఆలయా నిర్మాణం పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి లోని చేనేత భవన్ లో పద్మశాలి భవన్ నిర్మాణం పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశనికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి, సిరిసిల్ల పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు..
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణంలో మధ్యలో ఆగిపోయిన పద్మశాలీల కుల భవనము, మార్కండేయ స్వామి ఆలయం నిర్మాణాలు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు..బీసీ సంక్షేమ శాఖ ద్వారా 5 కోట్ల నిధుల విషయమై మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడడం జరిగిందన్నారు..టెస్కో నుంచి కూడా ఆర్థిక సహాయం అందజేయవలసిందిగా కోరడం జరిగింది అని తెలిపారు..ప్రస్తుతం పిల్లర్లు పోసిన భవనాన్ని స్లాబ్ వరకు తీసుకువచ్చి, మరో 3 కోట్ల 40 లక్షలతో కళ్యాణ మండపం నిర్మాణం పూర్తిచేసుకుని, అందులో పద్మావతి అమ్మవారి దేవాలయాన్ని నిర్మాణం చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.. మరో 2 కోట్లతో మార్కండేయ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని మొత్తం 11 కోట్లతో అన్ని నిర్మాణాలు పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు..
చేనేతలకు ప్రభుత్వ పక్షాన పెండింగ్ లో ఉన్న బిల్లులన్నీ ఇప్పించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పవర్లూమ్ కార్మికులకు పని కల్పించాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా తల్లులకు ఇందిరా మహిళా శక్తి చీరలు అందజేస్తున్నట్లు తెలిపారు.. గతంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారికి మనోధైర్యాన్ని కల్పిస్తూ అంత్యోదయ కార్డులను అందజేసినట్లు గుర్తు చేసుకున్నారు.

భవిష్యత్తులో చేనేత, పవర్లూమ్ కార్మికులకు సంబంధించి ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజా ప్రభుత్వం చూసుకుంటుందని తెలిపారు.. ప్రభుత్వమిచ్చిన ఆర్డర్లను సకాలంలో పూర్తి చేయాలని తెలిపారు.. రాష్ట్ర ప్రభుత్వం మీరు చెప్పింది వింటునట్లు తెలిపారు.. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు రుణమాఫీ చేసిందని అన్నారు..నేతన్నల ఎన్నో ఏళ్ల కల 50 కోట్లతో యారన్ డిపో ఏర్పాటు చేసినట్లు తెలిపారు..పేదలకు ఉపయోగపడే ప్రతి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు..ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్,బీసీ వేల్పర్ అధికారులు బల మాయదేవి, సిరిసిల్ల పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు..

కాంగ్రెస్ ది కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ షాకిర్.

పేదలకు ఇండ్లు నిర్మిస్తున్న ఘనత కాంగ్రెస్ ది కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ షాకిర్.
మెట్ పల్లి జూన్ 20 నేటి దాత్రి:

 

గతంలో పేదవారికి రోటి, మకాన్ అని మాజీ ప్రధాని దివంగత నేత ఇందిరాగాంధీ నినాదించి పేద ప్రజలకు ఉచితంగా బియ్యాన్ని అందించి. ఇండ్లను నిర్మించి ఇచ్చిందని ఇందిరాగాంధీ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఇందిరమ్మ పేరుతో ఇండ్లను మంజూరు చేస్తుందని. పేదవారికి ఇండ్లు నిర్మించే ఘనత కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ షాకీర్ సిద్ధికి అన్నారు. శుక్రవారం పట్టణంలోని అర్బన్ కాలనీలో పేద ప్రజలకు మంజూరైన 21 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి షాకీర్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యురాలు దివ్య, ఏ ఈ లు తిరుపతి, శరత్, ఇంజనీర్ జాకీర్, సోయబ్, కాంగ్రెస్ నాయకులు మురళి, ఇరుగదిండ్ల శ్రీనివాస్, లక్ష్మమ్మ, లడ్డు, రాములు,

నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన.

నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన

 

మల్లాపూర్ జూన్ 20 నేటి దాత్రి

 

 

 

మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. ఈ కార్యక్రమంలో మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా… కొత్త కాపు వెంకట్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా… కొత్త కాపు వెంకట్ రెడ్డి జన్మదిన వేడుకలు

బాలానగర్ /నేటి ధాత్రి

 

 

 

బాలానగర్ మండల కేంద్రానికి చెందిన కొత్త కాపురం వెంకట్ రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి హాజరయ్యారు. కేక్ కట్ చేసి పలువురికి పంచారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీ ఆర్ ఎస్ సత్తా చూపి.

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీ ఆర్ ఎస్ సత్తా చూపి

మాజీ సిఎం కె.సి.ఆర్ కు అండగా ఉండాలి

మాజీమంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి నెటిదాత్రి :

 

ఘనపూర్ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు
బి.ఆర్.ఎస్ ఘనపూర్ మండల ముఖ్య నాయకుల సమావేశంలో పార్టీ అధ్యక్షులు రాళ్ళ.కృష్ణయ్య నివాసంలో నిర్వహించారు
ఈ సమావేశం లోముఖ్య అతిథిగా నిరంజన్ రెడ్డి పాల్గొని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశరు ఈ సందర్భంగా.మాజీ మంత్రి మాట్లాడుతూ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పి టిసి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలతో టాచ్ లో ఉండాలని సూచించారు మండల బీ ఆర్ ఎస్ నాయకులు గ్రామాలలో పర్యటించి ప్రజలతో కలవాలని 19నెలల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ప్రజల మన్ననలను పొందిన నాయకులను గుర్తించి వారికి అవకాశం ఇవ్వాలని అన్నారుపార్టీ పట్ల నిబద్ధత,నాయకుని పట్ల విశ్వాసం ఉన్న నాయకులకు బీ ఆర్ ఎస్ పార్టీ అవకాశం ఇస్తుందని అన్నారుపార్టీలో ఉంటూ ఇతర పార్టీలకు సహకరించే నమ్మకద్రోహుల పట్ల పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చా రు ప్రజలు స్థిర నిర్ణయానికి వచ్చినారని మాజీ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ హయాములో రాష్ట్ర అభివృద్ధి జెరిగింద ని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఎట్లా నిర్వీర్యం అయినాయో స్పష్టమైన అవగాహనతో ప్రజల కు తెలుసు నాని అన్నారు ఎప్పటికప్పుడు గ్రామాలలో ప్రజల సమస్యల పట్ల స్పందిస్తూ వారికి అండగా నిలవాలని నిరంజన్ రెడ్డి ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,మాజీ ఎం.పి.పి కృష్ణా నాయక్,మాజీ మార్కెట్ ఛైర్మెన్ లక్ష్మారెడ్డి,మాజీ జేడీపీ టి సి సామ్యా నాయక్ మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ బాలేశ్వర్ రెడ్డి, ఎస్.టి సెల్ జిల్లా నాయకులు జాతృ నాయక్,మాజీ ప్రజాప్రతినిధులు,వివిధ గ్రామాల అధ్యక్షులు ,ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

మావోయిస్ట్ పార్టీ అగ్రనేత గాజర్ల రవి పార్థీవ దేహానికి.

మావోయిస్ట్ పార్టీ అగ్రనేత గాజర్ల రవి పార్థీవ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన

మాజీ జడ్పిటిసి మోటపోతుల శివ శంకర్ గౌడ్

గణపురం నేటి ధాత్రి

 

 

 

 

వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్ట్ పార్టీ అగ్రనేత గాజర్ల రవి అలియాస్‌ గణేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి జిల్లా మారేడుమిల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కింటుకూరు అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటరులో మరణించారు.మృతదేహం ఈరోజు ఉదయం స్వంత గ్రామం వేలిశాలకు రాగా విషయం తెలుసుకున్న గణపురం మండల కేంద్రానికి చెందిన మాజీ జడ్పిటిసి మోట మోటపోతుల శివ శంకర్ గౌడ్ వేలిశాల గ్రామానికి వెళ్లి పార్థీవ దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. అనంతరం మృతి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ నేత గాజర్ల రవి అలియాస్ గణేష్ సోదరుడు అయినటువంటి మాజీ మావోయిస్టు నేత, ప్రస్తుత పిసిసి అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ ఐతు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుని వారిని ఓదార్చారు. వారి వెంట గణపురం మండల కేంద్రానికి చెందిన నాయకులు పాల్గొన్నారు.

తప్పుడుసమాచారం ఇచ్చినందుకు బహిరంగ క్షమాపణ ..!

తప్పుడుసమాచారం ఇచ్చినందుకు బహిరంగ క్షమాపణ ..!

*పగిడి పల్లి రవి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు

మంగపేట నేటిధాత్రి

 

 

 

 

మంగపేట మండలం బుచ్చంపేట గ్రామం ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మరియు రాజీవ్ యువ వికాసం పథకం విషయం లో వచ్చిన కథనాల్లో ఎలాంటి నిజం లేదని, నేను ఎవరికీ డబ్బుల రూపంలో కానీ ఫోన్ పే ల ద్వారా కానీ ఎలాంటి నగదు చెల్లించలేదని , కాటూరి నాగయ్య, జంగం భానుచందర్, ఎడ్ల నరేష్ ,పల్లె శోభన్ బాబుల పేర్లను ప్రస్తావిస్తూ నేను చేసిన ఆరోపణలు పూర్తి గా అవాస్తవం అని ఆ ఆరోపణలు చేసిన పగిలిపెళ్లి రవి అనే నేను వారికి బహిరంగంగా క్షమాపణ చెపుతున్నాను. ఇట్టి విషయము నా సొంత నిర్ణయాలుతో నేను చేసినది కాదు అని కొన్ని ఒత్తిడిల మరియు పార్టీ మీటింగ్ లకు పిలువ లేదు అనే కారణాలవల్ల వారిపై ద్వేషం తో నేను పత్రిక కు మీడియాకు ఇవ్వాల్సి వచ్చిందని నా తప్పును మన్నించగలరని ఇలాంటి తప్పుడు సమాచారం ఇంక నేను ఎప్పుడూ కూడా ఇవ్వనని మీడియా ద్వారా ప్రజానీకానికి మరియు కాంగ్రెస్ పార్టీకి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకు గ్రామ బుచ్చంపేట కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగా పత్రిక ముఖంగా క్షమాపణ కోరుతున్న..

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ దే విజయం.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ దే విజయం

వేలకోట్ల రూపాయలు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా

రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా నిలబెట్టా.

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి.

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.

నల్లబెల్లి, నేటిధాత్రి:

 

 

 

 

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బూటకపు వాగ్దానాలు అవినీతి పాలనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్ లో మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మి మార్పు వస్తుందని ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించగా ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడం పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని. 18 నెలలోనే ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకించడం దేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి దక్కిందని ఆయన ఎద్దేవ చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మండలంలో ప్రతి తండాకు, గ్రామానికి తారు రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించి 40 కిలో మీటర్ల పొడవున కంకర వేసి తారు రోడ్డు వేసే సమయంలో నోటిఫికేషన్ రాగా అట్టి పనులను ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రస్తుత ఎమ్మెల్యే పనులను రద్దు చేయడం విడ్డూరంగా ఉంది. మండలంలో పార్టీలకతీతంగా రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు, పైపులు మోటార్లు ఇవ్వడం జరిగిందని అలాగే అకాల వర్షాలతో రైతులకు పంట నష్టం జరగగా ప్రతి రైతుకు పదివేల చొప్పున నష్టపరిహారం ఇప్పించి మరికొంతమంది కి రాలేదని నా దృష్టికి రావడంతో ప్రత్యేకంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి మరల 3000 మందికి నష్టపరిహారం మంజూరు చేయించి అప్పటి కలెక్టర్ వద్ద మంజూరు నిధులను ఉంచడం జరిగిందని.

 

BRS

 

ఇప్పుడున్న ఎమ్మెల్యే దానిపై ఎందుకు దృష్టి పెడుతలేరని దానితోనే రైతులపై మాధవరెడ్డికి ఎంత ప్రేమ ఉందో రైతన్నలు గమనించాలని అన్నారు. ఒకప్పుడు రాజకీయ కక్షలకు నిలయంగా మారిన నర్సంపేట నియోజకవర్గం వర్గాన్ని శాంతియుతంగా అన్ని రాజకీయ పార్టీలు, కులాల మతాలకు అతీతంగా ఎలాంటి గొడవలుకు తావు లేకుండా శాంతి సామరస్యాన్ని నెలకొల్పితే మళ్లీ దురదృష్టవస్తు ఒక దుర్మార్గున్ని గెలిపించుకోగా ఊర్లలో రౌడీ రాజకీయం మళ్ళీ మొదలైంది ఇలాంటి వాటికి చరమగీతం పాడాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త చెమటోర్చి కసిగా పనిచేస్తేనే విజయం దిశగా పరుగులు తీస్తారని ఆయన కార్యకర్తలకు సూచన చేశారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అజ్ఞానంతో తెలిసి తెలియక ప్రాజెక్టులపై మాట్లాడడం విడ్డూరంగా ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో దేవాదుల ప్రాజెక్టు ఎక్కడ ఉందో కూడా తెలియని అజ్ఞాన వ్యక్తి రేవంత్ రెడ్డి. దేవదుల ప్రాజెక్టు గోదావరి నదిపై ఉన్నదా లేదా కృష్ణా నదిపై ఉన్నదా తెలియక పోయినా ప్రాజెక్టులపై మాట్లాడడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీలను ప్రభుత్వం ఏర్పడిన నుండి ప్రతి పైసా ప్రజలకు అందే విధంగా ప్రజల పక్షాన ఉండి పోరాటం చేసే దిశగా బిఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, పిఎసిఎస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ రావు, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్ గౌడ్, మాజీ జెడ్పిటిసి హరినాథ్ సింగ్, మాజీ వైస్ ఎంపీపీ పాలెపు రాజేశ్వరరావు, క్లస్టర్ ఇన్చార్జిలు గందె శ్రీనివాస్ గుప్తా, మామిళ్ళ మోహన్ రెడ్డి, ఇంగ్లీ శివాజీ, వైనాల వీరస్వామి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ తక్కలపల్లి మోహన్ రావు, మాజీ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు నాన బోయిన రాజారాం యాదవ్, మండల మహిళా అధ్యక్షురాలు గోనె శ్రీదేవి, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఖ్యాతం శ్రీనివాస్, మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు, ఆయా గ్రామాల పార్టీ అధ్యక్షులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ సారధి మంత్రి సీతక్క…

సంక్షేమ సారధి మంత్రి సీతక్క…

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు…

సీనియర్ కాంగ్రెస్ నాయకులు జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి…

మంగపేట-నేటిధాత్రి

 

 

 

 

 

సంక్షేమ సారధి మంత్రి సీతక్క అని అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు శుక్రవారం మంగపేట మండలం అకినేపల్లి మల్లారం గ్రామంలో ఇటీవల మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల కి ముగ్గులు పోసి నిర్మాణ పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాల్లో మంజూరు కానీ పేదవాడి సొంతింటి కలని నేడు మంత్రి సీతక్క సాకారం చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు మొదటి విడతలో అకినేపల్లి మల్లారం గ్రామ పంచాయతీ కి మొత్తం పదమూడు ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని త్వరలోనే మరో విడతలో అర్హులైన పేదలందరికీ పార్టీలకతీతంగా ఇందిరమ్మ పక్కా ఇండ్లు మంత్రి సీతక్క సహకారంతో మంజూరు అవుతాయని అర్హులైన వారు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సాంబశివరెడ్డి అన్నారు ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు ప్రభుత్వ నిబంధనలను పాటించాలని గ్రామపంచాయతీ కార్యదర్శి మరియు గృహ నిర్మాణ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి లబ్ధిదారులకు సేవలు అందించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆమని కాంగ్రెస్ పార్టీ నాయకులు ధూళిపాల బాలకృష్ణ కటుకూరి శేషయ్య శెట్టిపల్లి నర్సింహారావు రవి సాంబశివరావు రాజు శెట్టిపల్లి పూలమ్మ గ్రామపంచాయతీ సిబ్బంది చెట్టిపల్లి వెంకటేశ్వర్లు ఇందిరమ్మ లబ్ధిదారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

ఎమ్మెల్యే పల్లా గారిని పరామర్శించిన మాజీ మంత్రి.

ఎమ్మెల్యే పల్లా గారిని పరామర్శించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ఇటీవల స్వల్ప ప్రమాదానికి గురై హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జనగామ ఎమ్మెల్యే డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిని శుక్రవారం మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు,జహీరాబాద్ శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు పరామర్శించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పల్లా గారిని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఎమ్మెల్యేలు సంగారెడ్డి, కుత్బుల్లాపూర్ వివేక్ గౌడ్,ఎమ్మెల్సీ నవీన్ రావు గార్లు ఉన్నారు.

రూపాదేవి వర్ధంతి వేడుకలు.

రూపాదేవి వర్ధంతి వేడుకలు

గంగాధర నేటిధాత్రి:

 

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి సతీమణి రూపాదేవి మొదటి వర్ధంతి వేడుకలను శుక్రవారం గంగాధర మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగాధర ప్రజా కార్యాలయంలో రూపా దేవి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గంగాధర ప్రభుత్వ పాఠశాలలో 200 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

గ్రామపంచాయతీ సందర్శించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.

మర్యాదపూర్వకంగా గ్రామపంచాయతీ సందర్శించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

 

తంగళ్ళపల్లి మండల నేరెళ్ల గ్రామపంచాయతీలో. తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు ప్రవీణ్. మర్యాదపూర్వకంగా కలిసి ప్రభుత్వం ప్రవేశపెట్టిన. రైతు భరోసా. గ్రామంలో రైతులందరికీ సక్రమంగా పడుతుందా. ఏమైనా సందేహాలు ఉంటే సంబంధిత అధికారుల.దృష్టికి తీసుకెళ్లి రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని. తరతరాలుగా పంటలు సాగు చేస్తూ జీవనోపాధి.పొందుతున్న రైతులకు రైతు భరోసా వచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత. అధికారులకు.సూచించారు అలాగే మండలంలో రైతులు. ఎలాంటి మాయమాటలు నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా తెలియజేశారు అలాగే నేను రైతులను దృష్టిలో ఉంచుకొని వచ్చాను తప్ప అధికారికంగా కాదు దయచేసి ప్రజలు గమనించాలి. ఈయన వెంట ఏ ఎం సి వైస్ చైర్మన్ నేరెళ్ళ నరసింహ గౌడ్. ఆరేపల్లి బాలు. రైతులు నాయకులు తదితరులు ఉన్నారు

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

 

మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిధిగా చిట్యాల ఎ ఎం సి వైస్ చైర్మన్ మహ్మద్ రఫీ పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణి చేశారు.అనంతరం రఫీ మాట్లాడుతూ. దేశ వ్యాప్తంగా ప్రతి గుండెను హత్తుకునేలా చేపట్టిన జూడో యాత్రతో ప్రజల కష్టాలను దగ్గరుండి చూసిన రాహుల్ గాంధీ ప్రతి పక్షనేతగా పేద ప్రజలకు న్యాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం చేస్తూ. దేశ ప్రజల అభ్యున్నతికై అనుక్షణం పరితపించే మృధుస్వభావి రాహుల్ గాంధీ అని. అలాంటి మహా నాయకునికి మొగుళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. ఈవేడుకల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తక్కళ్లపెల్లి రాజు, నడిగోటి రాము,ఏలేటి శివారెడ్డి, ఆకుతోట కుమార్, నీల రాజు, మంగళపల్లి శ్రీనివాస్, చంద్రబోస్, నాయకులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

 

 

 

కేసముద్రం మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ నందు మండలానికి చెందిన 13620 మంది రైతులకు 11 కోట్ల 83 లక్షల రూపాయలు రైతుల ఖాతాలో రైతు భరోసా జమ చేసిన సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు, డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి,

ఈ సందర్భంగా నాగేశ్వర్ రావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ తో పాటు రైతులు పండించిన వరి ధాన్యానికి గిట్టుబాటు ధర అలాగే సన్న రకం ధాన్యానికి 500 బోనస్, రైతు భరోసా అందించి రైతులకు ఎంతో మేలు చేసిందన్నారు.

ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డికి, ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ కు, ఎంపీ పొరిక బలరాం నాయక్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి,ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి,మాజీ ఎంపీపీ కదిరే సురేందర్,మాజీ ఎంపీపీ భూక్యా మల్సూర్,మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ ఓలం రమేష్,వసంత రావు, ఎండీ ఆయుబ్ ఖాన్, చింతకుంట్ల యాదగిరి,బ్లాక్ కాంగ్రెస్ కార్యదర్శి పోలేపాక నాగరాజు,మాజీ సర్పంచ్ వెంకన్న,మాజీ ఉపసర్పంచ్ బానోత్ వెంకన్న,యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు అల్లం గణేష్ యాదవ్,మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కళ్ళెం శ్రీనివాస్ రెడ్డి,గ్రామ పార్టీ అధ్యక్షులు కొండ సురేష్,నూకల వెంకటేశ్వర్లు, నేరేటి కొమరయ్య,గండి శ్రీనివాస్, సమ సుధాకర్, పోలేపల్లి వెంకట్ రెడ్డి,బలు,ఎండీ తాజోద్దీన్,రషీద్ ఖాన్, ఎండీ నవాజ్,తరాల సుధాకర్,బోడ విక్కి,శేఖర్ రెడ్డి, ఎలందర్,బాల,హనుమ,బాధ్య,శ్రీనివాస్,యాకాంతచారి,పరకాల కుమార్,ముజ్జు షేక్,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధానకార్యదర్శి తోట అఖిల్,సామల నరసయ్య,అజిత్ రెడ్డి, నియోజవర్గ ఉపాధ్యక్షుడు హరి కృష్ణ,మండల ఉపాధ్యక్షుడు ఎండీ సమీర్,సుందర్ వెంకన్న,మామిడిచెట్టు మల్లయ్య,తోట సుధాకర్,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

#యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు…

#ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే నాయిని,రాష్ట్ర మీడియా,కమ్యూనికేషన్ చైర్మన్…

హనుమకొండ, నేటిధాత్రి:

 

 

 

 

కాంగ్రెస్ భవన్/హనుమకొండ
పార్లమెంట్ ప్రధాన ప్రతిపక్ష నేత,ఎంపీ శ్రీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను గురువారం రోజు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.యువజన కాంగ్రెస్ శ్వేత ఆధ్వర్యంలో నిర్వహించిన రక్త దానం శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి,తెలంగాణ రాష్ట్ర మీడియా,కమ్యూనికేషన్ చైర్మన్ శ్రీ సామ రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
స్థానిక ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిస్ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారికి రాహుల్ గాంధీ జన్మదినం ఓ మంచి కార్యక్రమం కావాలని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.దాతలకు సర్టిఫికేట్స్ అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వతంత్ర దేశం నుంచి నేటి వరకు ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేస్తున్న ఏకైక కుటుంబమని,రాహుల్ గాంధీ అట్టడుగు వర్గాలకు అండగా నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేపట్టిన రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన రేషన్ కార్డులు,ఆరోగ్యశ్రీ,ఫీజు రీయింబర్స్ మెంట్ లాంటి ఎన్నో పథకాలతో నేడు పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.
ఈ వేడుకల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

శిక్షణ పొందితే సాధించనిది ఏమీ లేదు.

శిక్షణ పొందితే సాధించనిది ఏమీ లేదు.

#కుటుంబానికి భారం కాకుండా తల్లిదండ్రులకు భరోసాగా ఉండాలి.

#కంపెనీలు రాకతో ములుగు జిల్లా అభివృద్ధి.

రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.

ములుగు జిల్లా, నేటిధాత్రి:

 

 

 

యువతి, యువకులు ఉన్నత చదువులు చదివి ఉద్యోగ అవకాశాలు పొందాలని, యువత కుటుంబాలకు భారం కాకుండా తల్లిదండ్రులకు భరోసాగా ఉండాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
గురువారం జిల్లా కేంద్రంలోని టాస్క్ సెంటర్లో టెక్నికల్, నాన్ టెక్నికల్ కోర్సులలో శిక్షణ పొందిన 100 మంది నిరుద్యోగులలో పలు కంపెనీలలో ఉద్యోగాలకు ఎంపికైన 51 మంది యువతకు నియామక పత్రాలను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేన రెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రవిచందర్ సమక్షంలో అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పలు కంపెనీల ద్వారా శిక్షణ పొంది ప్రతిభ పెంపొందించుకుంటే సాధించనది ఏమీ లేదని అన్నారు.
ఎక్కువ వేతనం రావడం లేదని నిరాశ చెందకుండా వచ్చిన ఉద్యోగ అవకాశాలను చేస్తూనే ఎక్కువ వేతనం వచ్చే ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేయాలని సూచించారు. జిల్లాలో ఏర్పాటు చేస్తున్న పలు కంపెనీలను కాపాడుకుంటూనే ఇతర కంపెనీలు రావడానికి ప్రయత్నించాలని, కంపెనీలు రాకతో ములుగు నియోజకవర్గం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. నిరుద్యోగ యువతీ యువకులకు ప్రతిభ పెంపొందించుకోవడానికి టాస్క్ సెంటర్ ఆధ్వర్యంలో ఆరు నెలల క్రితం శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, ఇప్పటికీ శిక్షణ పొందిన వంద మందిలో 51 మంది యువతక
ఉద్యోగ అవకాశాలు పొందారని అన్నారు. టాస్క్ సెంటర్ ఆవరణంలో శ్రీయ ఇన్ఫోసియస్ కంపెనీ ఏర్పాట్లు చేసి అందులో ముగ్గురికి ఉద్యోగ అవకాశం కల్పించడం జరిగింది. నేడు యువత నిరక్షరాస్యత నుండి అక్షరాస్యతకు ఎదిగి ఉద్యోగ అవకాశాలు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 40 కంపెనీలకు చెందిన యజమానులు ములుగు జిల్లాలో పర్యటించారని, 10 గ్రామాలను దత్తత తీసుకొని గ్రామాల అభివృద్ధికి తోడ్పడుతున్నారని తెలిపారు.
ఈ రోజున 16 కంపెనీ లు పాల్గొన్నారని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మంత్రి సీతక్క ఒక శక్తి లాగా పనిచేస్తూ ఇప్పటికే పలు కంపెనీలు రావడానికి కృషి చేయడంతో పాటు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించబోతున్నారని, కంపెనీలు ఎదగడానికి ఉద్యోగులు కృషి చేస్తే వేతనాలు పెరుగుతాయని అన్నారు. ఎదుగుదలకు హద్దులేదని, చిన్న ఉద్యోగమని చులకన చేయవద్దని సూచించారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ సిన్హా – టాస్క్ సిఇఒ
ప్రదీప్ రెడ్డి – టాస్క్ ప్లేస్‌మెంట్ డైరెక్టర్
సేవ్న్ రెడ్డి – టాస్క్ రీజినల్ సెంటర్స్ హెడ్
సుధీర్ – టాస్క్ క్లస్టర్ మేనేజర్
రవి – సిఇఒ, శ్రీయా ఇన్ఫోటెక్
వినోడ్ – సిఎస్ఆర్ ఇన్‌ఛార్జి
బాలా – కాగ్నిజెంట్ సిఎస్ఆర్ బృందం, డొమైన్: ఐటి, ఐటిఇఎస్, ఫార్మా, బ్యాంకింగ్, మార్కెటింగ్, అమ్మకాలు, వ్యవసాయం, ఫైనాన్స్ మరియు నాన్ బ్యాంకింగ్, కంపెనీలకు చెందిన యాజమాన్యాలు టాస్క్ రీజినల్ సెంటర్ లో శిక్షణ పొందిన 100 మంది యువత, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

దేశానికి దిక్సూచి రాహుల్ గాంధీ.

దేశానికి దిక్సూచి రాహుల్ గాంధీ

తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి

 

 

 

 

 

 

సామాన్యులు,పేద ప్రజల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తున్న రాహుల్ గాంధీ దేశానికి దిక్సూచి అని కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్ అన్నారు.

గురువారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఎఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబానికి చెందిన నాయకుడు రాహుల్ అని పేర్కొన్నారు.రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్ర,న్యాయ్ యాత్ర దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిందని తెలిపారు.గాంధీ కుటుంబ వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రాహుల్.. తనదైన మార్క్‌తో దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించారన్నారు.లోక్ సభ ఎన్నికల్లో విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి అత్యంత బలీయ శక్తిగా ఉన్న బీజేపీని సమర్థంగా నిలువరించడంలో రాహుల్ చాలా వరకు సక్సెస్ అయ్యారని అభిప్రాయపడ్డారు.
ఆయన నాయకత్వం భవిష్యత్తులో దేశానికి అత్యంత అవసరమని తెలిపారు. దేశ భవిష్యత్తు ఆశాకిరణం రాహుల్ గాంధీ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ కంచర్ల వెంకటాచారి,మహిళా కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షరాలు పింగిలి ఉష,కాంగ్రెస్ నాయకులు చిత్తలూరి శ్రీనివాస్ గౌడ్,కందాడి అశోక్ రెడ్డి,దీకొండ మధు,వెన్నెం సోమిరెడ్డి,అజ్మీరా రమేష్ నాయక్, వెలుగు మహేశ్వరి, జె.రమేష్ నాయక్, జాటోత్ అమల, మెరుగు కర్ణాకర్,జనగామ జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి అభిరాం నాయక్,యూత్ పట్టణ అధ్యక్షుడు బసనబోయిన మహేష్ యాదవ్,యూత్ నాయకులు పరశురాములు, నడిగడ్డ మధు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజల కోసం శ్రమించే నిరంతర శ్రామికుడు రేవూరి.

ప్రజల కోసం శ్రమించే నిరంతర శ్రామికుడు రేవూరి.

⏩బి ఆర్ యస్. అసత్య ప్రచారాలు నమ్మదు.

⏩రాజకీయ స్వలాభం కోసం అమాయకులను బలిచేయద్దు.

⏩అర్హులైన వారికి విడతల వారిగా ఇందిరమ్మ ఇండ్లు.

⏩పేద ప్రజలకు అనునిత్యం అందుబాటులో కాంగ్రెస్ పార్టీ.

⏩మచ్చ లేని నాయకుడు రేవూరి.

దుపాకీ సంతోష్ కుమార్
16వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు

కాశిబుగ్గ నేటిధాత్రి

 

 

 

వరంగల్ నగరంలోని 16వ డివిజన్ పరిధిలోని గరీబ్ నగర్ బుధవారం రోజున బిఆర్ఎస్ నేతలకు స్థానిక కార్పొరేటర్ బిఆర్ఎస్ నాయకులు చేసిన అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ స్థానిక మహిళా వికలాంగురాలు లింగంపల్లి నిర్మల ఇంటిని సందర్శించి వారికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాన్ని అందించడం జరిగింది.

16వ డివిజన్ గరీబ్ నగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ దాసారాపు సారన్న ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో 16 డివిజన్ అధ్యక్షులు దుపాకి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు ఆలస్యం అవుతున్నాయని తెలుసుకున్న బిఆర్ఎస్ నాయకులు అదే అదునుగా చూసుకొని అమాయకురాలైన మహిళలను అడ్డుపెట్టుకొని వారి రాజకీయ స్వలాభం కోసం ప్రయత్నం చేస్తు బిఆర్ఎస్ నేతలు విఫలమయ్యారని అన్నారు.

గత బి ఆర్ యస్ పాలనలో చేసిన కమీషన్లకు, అక్రమాలకు పాల్పడిన వారు ప్రజా ప్రభుత్వం పై దుష్ప్రచారం చేయడానికి పూనుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్రమాలకు, అరాచకాలకు తావు లేకుండా, అభివృధే ధ్యేయంగా పని చేస్తున్న ప్రజా ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక,గరీబ్ నగర్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నేతలు అమాయకపు దళిత మహిళ వికలాంగురాలను చూపిస్తూ
బి ఆర్ యస్ పార్టీ రాజకీయ స్వలాభం కోసం అసత్య ప్రచారాలకు పాల్పడుతున్న టిఆర్ఎస్ నేతల మాటలను ఖండించారు.

ఇలాంటి ఉదంతాలను,అసత్య ప్రచారాలను గరీబ్ నగర్ ప్రజలు నమ్మద్దు అని,టోపీ పెట్టుకున్న నాయకులు వస్తున్నారు,మనకు టోపీ పెడుతారు జాగ్రత్త అని తెలిపారు.

గత బి ఆర్ యస్ ప్రభుత్వంలో ఇల్లు ఇవ్వకపోగా కనీసం ఒక తెల్ల రేషన్ కార్డు కూడా ఇచ్చిన పాపానపోలేదు అని ఎద్దేవ చేశారు.

ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం.

గరీబ్ నగర్ ప్రజలకు మాయమాటలు చెప్పి సుమారు 18 మంది ఇండ్లను కూలగొట్టి ఇల్లు ఇస్తాము అని, ఓట్ల కోసం రాజకీయం చేసిన పార్టీ బి ఆర్ యస్ పార్టీ అని,ఈ రోజు ప్రజా ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పై మాట్లాడే నైతిక హక్కు లేదు అని అన్నారు.

ఇందిరమ్మ ఇల్లు నియమ నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే దిశగా మన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి కృషి చేస్తున్నారని వారు తెలిపారు.

అంతేకాకుండా గరీబ్ నగర్ ప్రజలను మాయ మాటలతో మభ్యపెడుతూ, పది సంవత్సరాలు కాలయాపన చేసిన బీఆర్ఎస్ పార్టీ పేద ప్రజల బాధలు, వారి గోడు వినకుండా ఇష్ట రాజ్యాంగ వ్యవహరించి భూ కబ్జాలకు,అక్రమాలకు పాల్పడి, ఇప్పుడు గరీబ్ నగర్ లో జరుగుతున్న అభివృద్ధిని చూసి మతిభ్రమించిన టిఆర్ఎస్ నాయకులు ప్రజాక్షేత్రంలోకి రావడానికి ఏ ఆధారంలేక అమాయక ప్రజలను మోసపరుస్తూ, తప్పుడు ప్రచారాలు చేస్తూ తిరగడం వారికి అలవాటైపోయిందని ఈ సందర్భంగా తెలియజేశారు.

వరంగల్ జిల్లాలోనే మచ్చలేని నాయకుడిగా సుధీర్గ రాజకీయ అనుభవం ఉన్న నేత పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పై తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదు అని, ఇకనైనా అసత్య ప్రచారాలు మానుకోవాలని తెలిపారు.

బి ఆర్ యస్ నాయకులు ఆకాశం పై ఉమ్మితే అది వారి మొఖం పై పడుతుందని వారు గ్రహించాలి అని అన్నారు.

ప్రజల శ్రేయస్సు కోసం నిరంతర శ్రామికుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి అని అన్నారు.

ఇందిరమ్మ ఇండ్లు లబ్దిదారుల ఎంపికలో పారదర్శకంగా, చిత్తశుద్ధితో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నారు.

ఏ ఒక్క లబ్ధిదారుల దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా స్థానిక శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి సలహాలు,సూచనలు తీసుకోని పనిచేస్తుందని తెలిపారు.

కావాలనే కాంగ్రెస్ పార్టీ పైన,కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన బిఆర్ఎస్ నాయకులు బురద చల్లుతున్నారు.ఏ ఒక్క లబ్ధిదారుడు దగ్గరైన డబ్బులు వసూలు చేసినట్టు రుజువు చేయిస్తే ఎంతటి శిక్షకైనా సిద్ధమేనని వారు అన్నారు.
బిఆర్ఎస్ నాయకులు బహిరంగ చర్చకు సిద్దామా అని హెచ్చరించారు.

పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు పంపిణీ జరుగుతుందని అర్హులైన ప్రతి ఒక్కరికి విడతలవారీగా ఇండ్లు వచ్చే విధంగా శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి చొరవ తీసుకుంటారని తెలిపారు.

గతంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి 93,95 సర్వే నెంబర్ల లో భూ అక్రమాలకు పాల్పడి గరీబ్ నగర్ లోని పేద ప్రజలకు వచ్చే స్థలాని వారి సహచరులకు,బినామీలకు కట్టబెట్టి గరీబ్ నగర్ ప్రజలకు సొంత ఇంటి స్థలము లేకుండా చేశారని గుర్తుచేశారు.

గరీబ్ నగర్ లోని సొంత ఇంటి లేని వారికి సర్వేనెంబర్ 93,95లో ఇల్లు ఇప్పిండం కోసం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాము అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు కొండేటి కొమరారెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లెం సుధాకర్,గరీబ్ నగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాసారపు సారన్న,ఇందిరమ్మ కమిటీ సభ్యులు చెక్క లక్ష్మి, రమేష్, అఫ్రీన్,అంకేశ్వరపు రాజు,పిట్టల అనిల్, గ్రామ పార్టీ అధ్యక్షులు జానీ,హుజూర్,కీర్తి నగర్ ఇందిరమ్మ ఇండ్ల కమిటీ మెంబర్ పోతునూరీ మౌనిక, జన్ను రాజు,మార్త రాజశేఖర్, గుర్రం వెంకటేశ్వర్లు, పరకాల యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వల్లెం సాయి కుమార్, గొట్టిముక్కుల పరిపూర్ణ చారి గుర్రపు వెంకటేశ్వర్లు శివరాత్రి పెద్ద వెంకన్న. కృష్ణ, పోలేబోయిన శివ, బిర్రు ప్రసాద్, కె.మోహన్, జన్ను రాజు తక్కల్లపల్లి రాజశేఖర్,నూరుజహాన్,గొర్రె కరుణాకర్,ఐత అశోక్, జన్ను కళ్యాణ్, భరద్వాజ్. శివరాత్రి చిన్న వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్.

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్.

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం రోజున భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని రైతుల ప్రభుత్వమని పేదల కోసం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశం పెట్టిన ప్రభుత్వం అని అన్నారు అలాగే ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వ ప్రపంచంలో ఎక్కడా లేదని ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు అనంతరం భూపాలపల్లి నియోజకవర్గం లోని చిట్యాల టేకుమట్ల మండలాలకు చెందిన 52 మంది లబ్ధిదారులకు దాదాపు 25 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి టేకుమట్ల మండల అధ్యక్షులు కోటగిరి సతీష్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మధువంశీకృష్ణ కాంగ్రెస్ జిల్లా నాయకులు చిలుకల రాయకు ఉండు లక్ష్మణ్ గౌడ్, చిట్యాల టేకుమట్ల మొగుళ్ళపల్లి మండలాల కాంగ్రెస్ నాయకులు సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version