విద్యుత్ షాక్ కు గురై గేదె మృతి..
కేసముద్రం నేటి ధాత్రి:
కేసముద్రం మండలంలోని నారాయణపురం గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ షాక్ కు గురై గేదె మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బాధితుడు కేతిరి శ్రీనివాస్ రెడ్డి తెలిపిన కథనంప్రకారం, తనకి చెందిన సుమారు రూ.30 వేల విలువగల గేదె రోజువారి రీత్యా మేతకి వెళ్లడం జరిగిందని, ఈ నేపథ్యంలో గేదె ఇంటికి రాలేదని చుట్టుపక్కల ఉన్నటువంటి చేనులలో తిరగడంతో గ్రామంలోని ఓ రైతు వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద మృతి చెందిందని తెలిపారు, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ట్రాన్స్ఫార్మర్ ఎత్తుపై పెట్టకపోవడంతో ట్రాన్స్ఫార్మర్ కిందికి ఉండడం విద్యుత్ అధికారుల నిర్లక్ష్య వైఖరి పై గేదె మృతి చెందిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం అందజేయాలని బాధితుడు వేడుకుంటున్నారు.