జడ్చర్ల కేంద్రంలో ముస్లిం సోదరులను కలిసిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

మాజీ మంత్రి , జడ్చర్ల శాసన సభ్యులు,బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డా.చర్లకొల్ల లక్ష్మారెడ్డి మద్దతుగా శుక్రవారం రోజు జడ్చర్ల మున్సిపల్ పరిది 08 వ వార్డు మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి దొరేపల్లి లక్ష్మీ రవీందర్ వారి వార్డు 08 వ వార్డు లో శుక్రవారం సందర్భంగా మాజిత్ దగ్గరకు వెళ్ళి ముస్లిం సోదరులు నమాజ్ చదివిన అనంతరం ముస్లిం పెద్దలను, యువకులను కలిసి కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల మేనిఫెస్టో పత్రాలను అందరికీ అందజేస్తూ పథకాల గురించి తెలియజేస్తూ ఈ నెల 30 వ తేదీన జరుగుతున్న ఎన్నికలల్లో మీ అమూల్యమైన ఓటు ను కారు గుర్తుకు వేసి మన ప్రియతమ నాయకులు డా.చర్లకొల్ల లక్ష్మారెడ్డి ని అత్యధిక బారి మెజారిటీతో గెలిపించగలరని ప్రతి ఒక్కరినీ కోరుతూ ప్రచారాన్ని కొనసాగించారు, ఈ ప్రచార కార్యక్రమంలో వార్డు బిఆర్ఎస్ పార్టీ కమిటీ సభ్యులు,వార్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు,బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *