కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని జైపూర్ మాజీ ఎంపీటీసీ మంతెన లక్ష్మణ్ జైపూర్ గ్రామం రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంబల్ల రవి శుక్రవారం రోజున చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో మండల నాయకులతో కలిసి టిఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ పాలనలో సర్పంచులకు ఎంపీటీసీ లకు సరైన గౌరవం లేదని అన్నారు. పార్టీలో చేరిన వారందరికీ సముచిత స్థానం ఉంటుందని మండలంలోని నాయకులతో కలిసి ప్రజలకు సమాజానికి ఉపయోగపడే అభివృద్ధి పనులు చేయాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రిక్కుల శ్రీనివాస్ రెడ్డి జైపూర్ ఉపసర్పంచ్ సంపత్ రెడ్డి, కల్కి రమేష్, గంగిపల్లి సర్పంచ్ లింగారెడ్డి, శ్రీనివాస్ గౌడ్,రాజు ,సల్ల సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *